బ్రిడ్జ్ పైపు పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్న సాహస బాలిక
తనతో సహజీవనం చేసిన మహిళతో పాటు ఆమె కుటుంబాన్ని నదిలోకి తోసేశాడు ఓ కిరాతకుడు. భర్తతో గొడవల కారణంగా విడిపోయి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తోన్న సుహాసిని(36)జీవితంలోకి రెండేళ్ల క్రితం ప్రవేశించిన సురేశ్(30) మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. తాడేపల్లిలో నివాసముంటున్న ఈ ఇద్దరికి ఏడాది క్రితం ఓ పాప (జెర్సీ) కూడా జన్మించింది. అయితే ఎలాగైనా ఈ కుటుంబాన్ని వదిలించుకోవాలనుకున్న సురేశ్ సుహాసిని కుటుంబాన్ని షాపింగ్ పేరుతో రాజమండ్రి తీసుకెళ్లాడు..రాత్రంతా గడిపిన తర్వాత తెల్లవారుజామున 4గంటల సమయంలో వారందరిని గౌతమి పాత వంతెన దగ్గరకు తీసుకెళ్లి రెయిలింగ్ నుంచి తోసేశాడు. ఈ ప్రమాదంలో సుహాసిని, జెర్సీ నదిలో గల్లంతవగా.. కుమార్తే కీర్తన రెయిలింగ్కి అనుకోని ఉన్న పైపును పట్టుకోని ప్రాణాలు కాపాడుకుంది.