Nithya Menen: సోషల్ మీడియా లో సిని సెలబ్రేటీలపై ఎప్పుడు ఎదో ఒక వార్త వైరల్ అవుతునే ఉంటుంది. అయితే కొంత మంది అలాంటి వార్తలను లైట్ గా తీసుకుంటుంటారు. మరి కొంత మంది మాత్రం సీరియస్ గా స్పందిస్తుంటారు. తాజాగా ప్రముఖ హీరోయిన్ ఆమెపై వచ్చిన రూమర్ ను ఖండించింది.
ఓ తమిళ హీరో తనను వేధింపులకు గురిచేశాడంటూ వస్తున్న కథనాలను నిత్యా మీనన్(Nithya Menen) కొట్టి పారేసింది . ఓ సినిమా చిత్రీకరణ సమయంలో తమిళ్ హీరో వేధించినట్టు వచ్చిన కథనాలపై సీరియస్ గా స్పందించింది. ‘‘తెలుగు పరిశ్రమలో నేను ఎప్పుడూ ఇబ్బందులు ఎదుర్కోలేదు. కానీ, తమిళ పరిశ్రమలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఓ సినిమా షూటింగ్ లో భాగంగా తమిళ హీరో నన్ను వేధింపులకు గురి చేశాడు’’ అంటూ నిత్యా మీనన్ చెప్పినట్టుగా వార్త వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వార్త నిజం కాదని ఆమె స్పష్టం చేసింది.
It’s very sad that certain sections of journalism have come down to this. I urge you – Be Better than this! 😊#stopfakenews @letscinema pic.twitter.com/zevdEPqTlL
— Nithya Menen (@MenenNithya) September 26, 2023
తప్పుడు కథనాలు ప్రసారం చేయవద్దంటూ ప్రముఖ హీరోయిన్ నిత్యా మీనన్ కోరింది. ‘‘జర్నలిజంలో కొన్ని వర్గాలు ఈ స్థాయికి దిగజారడం ఎంతో బాధను కలిగిస్తోంది. దీనికంటే మెరుగ్గా ఉండాలని కోరుతున్నాను’’ అంటూ పోస్ట్ పెట్టింది. ‘‘ఇది పూర్తిగా అవాస్తవం. నేను ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఈ వదంతుల వ్యాప్తిని ఎవరు మొదలు పెట్టారో చెప్పండి. కేవలం క్లిక్ ల కోసం ఈ తరహా అవాస్తవాలను ప్రచారం చేసే వారిని బాధ్యులను చేయాలి’’ అని నిత్య మీనన్ మండిపడింది. ప్రస్తుతం నిత్యా మీనన్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
Also Read: గ్లామర్ తగ్గని ప్రియమణి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు తల్లిగా నటిస్తుందా..?