ఇద్దరు చిన్నారులు సహా తొమ్మిది మందిని బలి తీసుకున్న నాంపల్లి రెడ్హిల్స్అగ్నిప్రమాదానికి భవన యజమాని రమేశ్ జైస్వాల్ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని అగ్నిమాపక శాఖ తేల్చింది. పార్కింగ్కోసం కట్టిన స్టిల్ట్ఫ్లోర్తో పాటు…సెట్బ్యాక్ ప్రాంతాల్లో కూడా తేలికగా మండే స్వభావమున్న రసాయనాల డ్రమ్ములు ఇతర వస్తువులను నిల్వ చేయటమే ఇంతటి విషాదానికి దారి తీసిందని నిర్ధారించింది. భవనం నుంచి బయటకు రావటానికి కేవలం మెట్ల మార్గం మాత్రమే ఉండటం… అగ్నిప్రమాదం సంభవించగానే ఆ మార్గం అంతా దట్టమైన పొగ అలుముకోవటంతో లోపల ఉన్నవారు బయటకు రాలేక ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలిపింది. ఇక, ప్రమాదానికి బల్దియా నిర్లక్ష్యం కూడా కారణమని స్పష్టమవుతోంది. ఆ ప్రాంతంలో జీ ప్లస్2 అంతస్తుల భవనాలు నిర్మించటానికి మాత్రమే అనుమతులు ఉండగా రమేశ్ జైస్వాల్జీ ప్లస్4 అంతస్తులు…ఆపై పెంట్హౌస్కట్టినా చర్యలు తీసుకోవటంలో మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏమిటంటే నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మించిన రమేశ్ జైస్వాల్అగ్నిమాపక శాఖ నుంచి ఎన్వోసీ కూడా తీసుకోకపోవటం.
ALSO READ: సీఎం కేసీఆర్ కు కోటి రూపాయిల అప్పు ఇచ్చిన నేత.. ఎవరంటే?
నాంపల్లి రెడ్హిల్స్ ప్రాంతంలో రమేశ్ జైస్వాల్ అనే వ్యాపారికి చెందిన బాలాజీ రెసిడెన్సీ ఉంది. ఉదయం 9.30గంటల సమయంలో భవనం స్టిల్ట్ఫ్లోర్లో మంటలు చెలరేగగా వెంటనే స్థానికులు ఫైర్ కంట్రోల్రూంకు ఫోన్ చేశారు. దాంతోపాటు మంటలను అదుపు చేయటానికి ప్రయత్నించారు. అయితే, స్టిల్ట్ఫ్లోర్లో రసాయన పదార్థాలతో నిండి ఉన్న డ్రమ్ములు, తేలికగా మండే స్వభావం ఉన్న వస్తువులు ఉండటంతో క్షణాల్లోనే విస్తరించిన మంటలు భవనం నాలుగో అంతస్తు వరకు చేరుకున్నాయి. కాగా, కంట్రోల్రూంకు ఫోన్రాగానే గౌలిగూడ చమన్, జూబ్లీహిల్స్, సాలార్జంగ్మ్యూజియం, సెక్రటేరియట్, యాఖుత్పురా ఫైర్స్టేషన్ల నుంచి ఫైరింజన్లు, మల్టీపర్పస్ టెండర్ వాహనాలు, సైమన్ స్నార్కెల్, బ్రోంటో స్కై లిఫ్ట్వాహనం అక్కడకు హుటాహుటిన చేరుకున్నాయి. అప్పటికే మంటలు పై అంతస్తులకు ఎగబాకాయి. దాంతో భవనం మొత్తం దట్టమైన పొగ అలుముకుంది. పరిస్థితిని గమనించిన అగ్నిమాపక సిబ్బంది ఒకవైపు మంటలు ఆర్పటానికి ప్రయత్నిస్తూనే మరోవైపు బ్రోంటో స్కైలిఫ్ట్ వాహనం, మెట్ల మార్గంద్వారా భవనం లోపలి చిక్కుకున్న వారిలో 21మందిని బయటకు తీసుకువచ్చారు. వీరిలో నలుగురికి తీవ్రంగా గాయాలు కాగా మిగితా వారికి స్వల్ప గాయాలయ్యాయి. వీరందరినీ వెంటనే చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ALSO READ: జానారెడ్డితో పాటు ఆరుగురు అభ్యర్థుల నామినేషన్స్ రిజెక్ట్!
నగరంలోని పలు చోట్ల ఇలాగే రసాయనాల డ్రమ్ములు, తేలికగా మండే స్వభావం ఉన్న వస్తువులను సెల్లార్లు, స్టిల్ట్ఫ్లోర్లలో నిల్వ చేస్తున్నట్ట తమ దృష్టికి వచ్చిందని అగ్నిమాపక శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇలా ఎక్కడ కనిపించినా వెంటనే ఫైర్, పోలీస్, బల్దియా శాఖలకు సమాచారం అందించాలని కోరారు. ఇక, భవన యజమానులు తప్పనిసరిగా తమ తమ భవనాల్లో ఫైర్ఫైటింగ్సిస్టంను ఏర్పాటు చేసుకోవాలన్నారు. వాణిజ్య కాంప్లెక్సులు, పెద్ద ఎత్తున వ్యాపారం చేసే ఇతర సంస్థలు సెక్యూరిటీని పెట్టుకున్నట్టుగా ఫైర్ఫైటింగ్ఆఫీసర్లను నియమించుకోవాలన్నారు. ఒక్క మెట్ల మార్గమే కాకుండా ఏదైనా ప్రమాదం జరిగినపుడు బయట పడటానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయించాలన్నారు. ఇక, భవన సెట్బ్యాక్ప్రాంతాలను ఖాళీగా ఉంచాలని సూచించారు. అప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే ఫైరింజన్లు లోపలికి వెళ్లి మంటలు ఆర్పటానికి సులువుగా ఉంటుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 101 నెంబర్కు ఫోన్చేసి సమాచారం అందించాలని కోరారు.
అగ్నిప్రమాద మృతుల వివరాలు :
రెండవ అంతస్తు :
(1) మహ్మద్ ఆజమ్, 54
(2) మహ్మద్ హసీబుర్ రెహమాన్ ,
(3) రెహానా సుల్తానా , 50
(4) తహూరా ఫర్హీన్, BDS doctor , 38
(5) తూభ, 5
( 6 ) తరూబా, 12(తహూరా ఫర్హీన్ ఇద్దరు పిల్లలు )
(7) ఫైజా సమీన్ , 25 అవివాహిత
(8) నికత్ సుల్తానా, 50 సంవత్సరాలు
(9)జకీర్ హుససేన్ 66 సంవత్సరాలు
Bds డాక్టర్ తహూర ఫర్జీన్ ఈ బిల్డింగ్ లో నివాసం వుండరు..
సెలవులు వుండడంతో పిల్లలతో పాటు బంధువుల ఇంటికి వచ్చింది.