Kangana: చండీగఢ్ విమానాశ్రయంలో బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఆమెపై పోలీసులు కేసు నమోదు చేయగా.. విధుల నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. సాగు చట్టాలను వ్యతిరేకించిన రైతులపై గతంలో కంగన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే ఆమెపై చేయు చేసుకున్నట్లు కుల్విందర్ కౌర్ మీడియాతో పేర్కొన్నారు. కాగా, కుల్విందర్ కౌర్కు పలు రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆమెకు తమ మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలిపారు రైతు సంఘాల నేతలు. ఈ ఘటనపై సరైన విచారణ జరపాలంటూ పంజాబ్ డీజీపీని కలసి కోరతామని ఆ సంఘాల నేతలు సర్వణ్ సింగ్ పందేర్, జగ్జిత్ సింగ్ దల్లేవాల్ తెలిపారు. ఇదే డిమాండ్తో ఈనెల 9వ తేదీన మొహాలీలోని ఎస్పీ కార్యాలయానికి ర్యాలీ నిర్వహిస్తామని అన్నారు.
kangana
Kangana: బీఫ్ మాంసం తింటుంది… బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అదిరిపోయే ఆన్సర్!
Kangana: బీజేపీ (BJP) లోక్ సభ అభ్యర్థిగా, హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) నుంచి బరిలోకి దిగుతున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై కాంగ్రెస్ నేత వివాదాస్పద ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమె బీఫ్ తింటుందని తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలు గురించి తాజాగా కంగనా స్పందించింది.
తన పై వస్తున్న ఆరోపణలు పూర్తిగా ఆధారం లేనివని ఆమె కొట్టిపారేశారు. తాను గొడ్డు మాంసమే కాదు…ఏ రకమైన రెడ్ మీట్ తినను. నా పై వస్తున్న ఆరోపణలు అన్ఇన కూడా పూర్తి నిరాధారమైనవంటూ ఆమె కొట్టి పారేశారు. ఇలాంటివి వ్యాప్తి చేయడం చాలా సిగ్గు చేటు అంటూ ఆమె చెప్పుకొచ్చారు.
ఎన్నో సంవత్సరాలుగా తాను యోగ, ఆయుర్వేద జీవన విధానాన్ని అనుసరిస్తున్నట్లు ఆమె తెలిపారు. నా పరువును తీయడానికే ఇలాంటి ఆరోపణలు, చేస్తున్నారని ఆమె ఆరోపించారు.నా గురించి ప్రజలకు , నా అభిమానులకు అందరికీ తెలుసు. నేను హిందువుని అంటూ ఆమె జై శ్రీరాం అంటూ నినదించారు.
బీజేపీ అవినీతి నాయకులందరికీ స్వాగతం చెబుతోందని వాడెట్టివార్ విమర్శించారు. ఆ సందర్భంలోనే కంగనా బీఫ్ తింటుందని కూడా అన్నారు. దీని గురించి బీజేపీ అధికార ప్రతినిధి కేశవ్ ఉపాధ్యాయే మాట్లాడుతూ… వాడెట్టివార్ మాట్లాడిన మాటలు కాంగ్రెస్ మురికి సంస్కృతికి అద్దం పడుతున్నాయని అన్నారు.
Also read: మనదేశంలోనే సెల్ఫీ పిచ్చి ఎక్కువ.. అందుకే ఈ చావులు!
Lok Sabha: నేను బీఫ్ తినను..నేను గర్వించదగిన హిందువును కంగనా!
హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ నుంచి బీజేపీ అభ్యర్థి, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బీఫ్ తిన్నారంటూ వస్తున్న ఆరోపణలపై స్పందించారు. కాంగ్రెస్ మంత్రి విక్రమాదిత్య సింగ్ కంగనా పేరు తీసుకోకుండా ఆమెను టార్గెట్ చేయడంతో ఇప్పుడు కంగనా రనౌత్ స్పందించింది. నేను బీఫ్, మరే ఇతర రెడ్ మీట్ తినను. నాపై నిరాధారమైన పుకార్లు ప్రచారం చేయడాన్ని నేను ఖండిస్తున్నాను. నేను చాలా సంవత్సరాలుగా యోగిక్ ఆయుర్వేదానికి మద్దతునిస్తు ప్రచారం చేస్తున్నాను. ఇప్పుడు నా ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇలాంటి వ్యూహాలు ఎలాంటి ప్రభావం చూపవు. నేను ఒక గర్వించదగ్గ హిందువునని నా ప్రజలకు తెలుసు. వారిని ఎవరూ తప్పుదారి పట్టించలేరని కంగానా వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ సుఖు ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రి విక్రమాదిత్య సింగ్ ఈ విషయంపై కంగనా పై పరోక్షం గా వ్యాఖ్యలు చేశారు. “హిమాచల్ దేవతల పవిత్ర ప్రదేశం. అది దేవభూమి. గోమాంసం తినే వారు ఇక్కడ, ఇక్కడ అనర్హులు. ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయాలంటే చాలా పవిత్రతో ఉండే వారు మాత్రమే చేయాలని వారు అన్నారు.
మండి లోక్సభ స్థానం నుంచి కంగనా రనౌత్పై కాంగ్రెస్ తరపున విక్రమాదిత్య సింగ్ను బరిలోకి దింపడం గమనార్హం. విక్రమాదిత్య సింగోలి నుంచి .తొలిసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. విక్రమాదిత్య సింగ్ తల్లి ప్రతిభా సింగ్ మండి లోక్సభ స్థానం నుంచి మూడుసార్లు ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఎంపీగా కూడా ఉన్నారు.
టికెట్ లభించిన తర్వాత, కంగనా రనౌత్ మండి జిల్లాలో ఆరు రోజుల పాటు ప్రచారం చేసి, ఆ తర్వాత కొన్ని రోజులు ముంబైకి వెళ్ళింది. కంగనా ఆ తర్వాత భంభ్లా నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. దీని తర్వాత ఆమె మండి నగరం, కర్సోగ్, డ్రాంగ్, సుందర్నగర్ తదితర ప్రాంతాల్లో ప్రచారానికి వెళ్లారు. ఇప్పుడు ఐదు రోజుల తర్వాత కంగనా ముంబై నుంచి మండికి తిరిగి రానుంది.
ఇందిరాగాంధీతో కంగన ఇంటర్య్వూ.. కల సాకారమైందంటూ పోస్ట్
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న అప్ కమింగ్ మూవీ ‘ఎమర్జెన్సీ’ని విభిన్నంగా ప్రమోట్ చేస్తుంది. సినిమా మొదలైనప్పటి నుంచి టైటిల్ తదితర అప్ డేట్స్ ఇస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న నటి.. ఇందులో స్వయంగా తానే మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటించబోతున్నట్లు ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచింది. అయితే ఇటీవల విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడటంతో మరింత ప్రచారం మొదలుపెట్టిన కంగన.. నేరుగా ఇందిరాగాంధీతో చిట్ చాట్ నిర్వహించినట్లు తెలిపే ఫొటోను నెట్టింట పోస్ట్ చేసింది.
ఈ మేరకు అధునాతన ఏఐ సాంకేతికతతో ఈ దృశ్యం సాకారమైందని తెలుపుతూ నెట్టింట నోట్ షేర్ చేసింది కంగన. ఐజీతో చాట్ చేయడం చాలా ఆనందంగా ఉందని, ఈ సినిమాలో ఇందిరా గాంధీ పాత్రకు చిత్రబృందం ఐజీ అని కోడ్ నేమ్ పెట్టుకున్నట్లు తెలిపింది. అలాగే ప్రధాని మోదీ (ఏఐ ఇమేజ్)తో దిగిన చిత్రాన్ని నటి పోస్టు చేశారు. ఢిల్లీలోని ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’లో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ దేశంలోని 14 మంది మాజీ ప్రధానులకు అంకితం చేసిన కొత్త మ్యూజియం ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’ను సోమవారం కంగన సందర్శించారు. వీరాంగనా కీ మహాగాథ పేరిట ఆవిష్కరించిన లైట్ అండ్ సౌండ్ షోలో ఆమె పాల్గొన్నారు. ‘పురాతన, ఆధునిక విధానాల ద్వారా చరిత్రలోని అనేక అధ్యాయాలు ఈ షో ద్వారా నా కళ్లముందు ఆవిష్కృతమయ్యాయి. కుటుంబ సమేతంగా వచ్చి వినోదంతో పాటు విజ్ఞానాన్ని పొందొచ్చని చెప్పింది. చివరగా మన దేశానికి గాంధీ మహా పురుషుడు, మోదీ యుగ పురుషుడు అంటూ ప్రశంసలు కురిపించింది.
Also read : Pooja gandhi: పెళ్లి పీటలు ఎక్కబోతున్న దండుపాళ్యం భామ!
ఇక ఈ సినిమా స్వతంత్ర భారతదేశంలో చీకటి రోజులుగా పరిగణించే ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల్ని ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తుండగా.. ‘మణికర్ణిక’ తర్వాత ఆమె దర్శకత్వం వహిస్తున్న చిత్రమిదే. ఈ చిత్రానికి ఆమె నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఒక సందర్భంలో ఈ సినిమా గురించి కంగన మాట్లాడుతూ.. తనకు సంబంధించిన ఆస్తులన్నింటినీ దీని కోసం తనఖా పెట్టినట్లు చెప్పారు. అయితే ఎమర్జెన్సీ విడుదల తేదీని నవంబర్ 24, 2023గా ప్రకటించినప్పటికీ తాను నటించిన సినిమాలన్నీ వరుసగా విడుదలకు సిద్ధంగా ఉన్నాయని చెప్పింది. అందుకే ఎమర్జెన్సీ సినిమాను కూడా 2024కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన నటి.. త్వరలోనే సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేస్తామని, అభిమానులు సహకరించాలని కోరింది.
స్త్రీలో ఆ శరీర భాగాలే కాదు..ఇతర అవయవాలు కూడా ఉన్నాయి: కంగనా ఫైర్!
కంగనా రనౌత్..బాలీవుడ్, టాలీవుడ్ లో ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫైర్ బ్రాండ్..ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే ఇచ్చి పడేస్తుంది అంతే. కంగనా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా కంగనా దసరా సందర్భంగా ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన రావణ దహన కార్యక్రమంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పాల్గొన్న విషయం తెలిసిందే. రావణ దహనం చేసిన తొలి మహిళగా కంగనా చరిత్ర సృష్టించారు.
ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు కంగనా బికినీ ధరించి ఉన్న ఫోటోను ఓ దానిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆమె పై విమర్శలు కురిపిస్తున్నారు. మోడీ ప్రభుత్వాన్ని అలరిస్తున్న లేడీ ఈమెనే అంటూ కామెంట్లు పెట్టారు. వీటిని చూసిన బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి స్పందిస్తూ కంగనా పై రెచ్చి పోయారు.
Also read: ఎన్నికల దెబ్బకు పెళ్లి బాజాలు మోగే ఇళ్లల్లో ఆందోళన..ఎందుకంటే..!!
కంగనా కోసం ఎస్పీజీ కాస్త ఎక్కువగానే స్పందిస్తోందని అన్నారు.ఎస్పీజీ అనేది ఒక గౌరవం లేని సంస్థ అని విమర్శించారు. ఆమెను రావణ దహనానికి ఆమెను పిలిచారంటే ఆమెకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో అర్థం అవుతుందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ విషయం గురించి కంగనా కూడా స్పందించింది.
” నా స్విమ్ సూట్ ఫోటో చూపించి ఇలా నీచంగా మాట్లాడారంటే మీ వక్రబుద్ది బయటపడింది…నేను రాజకీయాల్లోకి రావడానికి కేవలం నా శరీరాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నానని అనుకుంటున్నారా? . నేను ఇప్పటి వరకు ఒక నటిని, రచయిత, దర్శకుడు, నిర్మాత, విప్లవ రైట్ వింగ్ ఇన్ ఫ్లూయెన్సర్ని..నా బదులు భవిష్యత్తులో గొప్ప నాయకుడిగా ఎవరైనా యువకుడు ఉండి ఉంటే అతని గురించి కూడా ఇలాగే శరీరాన్ని అమ్ముకున్నాడు అనే మాట అనగలరా?
స్త్రీలు కేవలం సెక్స్ కోసం మాత్రమే కాదు. వారికి మెదడు, గుండె, చేతులు, పాదాలు వంటి ఇతర అవయవాలు కూడా ఉన్నాయి. గొప్ప నాయకుడిగా ఉండటానికి అవసరమైన ప్రతిదాన్ని కలిగి ఉంటారని” ఆమె ట్విట్టర్లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
With a swimsuit picture and sleazy narrative you are suggesting that I have nothing else to offer except for my flesh to get my way in politics ha ha I am an artist arguably the greatest of all time in hindi films, a writer, director, producer, revolutionary right wing… https://t.co/dEcqamn7qO
— Kangana Ranaut (Modi Ka Parivar) (@KanganaTeam) October 26, 2023
అసలు వాళ్ల పెళ్లే ఒక నాటకం..ఆఖరికి పుట్టిన పాపను కూడా అందుకే!
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ ఎవరు దొరుకుతారా వారి భరతం పడదామని వెయిట్ చేస్తూంటుంది. అది సల్మాన్ ఖాన్ అయినా..షారూక్ ఖాన్ అయినా ఆమెకు ఎవరైనా ఒకటే. ఛాన్స్ వచ్చిందా..ఏకి పారేశామా? అన్నట్లే ఉంటుంది ఆమె వ్యవహారం.
ఆమె కాలు దువ్వెది కూడా చిన్న చితకా స్థార్స్ తో కాదు. బడా స్టార్స్ తోనే. స్టార్ కిడ్స్ పైనే విరుచుకుపడుతుంది. ఆమెకు బాలీవుడ్ బడా డైరెక్టర్ కరణ్ జోహర్ అంటే అసలు పడదు. ఎప్పుడు ఎక్కడ దొరుకుతాడా? గట్టిగా ఇచ్చిపడేదాం అని చూస్తూంటుంది.
అసలు ఆయనకు ఇవ్వాల్సిన కనీస మర్యాద, గౌరవం కూడా ఇవ్వదు. కొద్ది రోజుల క్రితం ఆయన తీసిన రాఖి ఔర్ రాణి కి ప్రేమ్ కహాని చిత్రం గురించి ఆమె చేసిన దారుణమైన ట్రోల్స్ ని ఇప్పటికీ బాలీవుడ్ వర్గాలు మరచిపోలేదు.
ఈ క్రమంలోనే కంగనా మరోసారి రణబీర్ మీద విరుచుకుపడింది. తనతో డేటింగ్ కోసం రణబీర్ చాలా ట్రై చేశాడని పెద్ద షాక్ ఇచ్చింది. అయితే ఇక్కడ రణబీర్ పేరుని కంగనా ప్రస్తావించలేదు. ఓ మాఫియా స్టార్ అంటూ పేర్కొంది. క్వీన్ టైమ్ లో అయితే ఆ మాఫియా స్టార్ కి ఇంకా పెళ్లి కాలేదు.
అప్పటికే నా బ్యాగ్రౌండ్ మొత్తం సేకరించి నా వెనుక పడడం మొదలు పెట్టాడు. నేనంటే పిచ్చ ఇష్టం. నేను షూటింగ్ కోసం ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవాడు. డేటింగ్ అంటూ వేధించేవాడు. కానీ నేను ఎప్పుడు కూడా ఒప్పుకోలేదు. దానితో నా మీద రకరకాల ప్రయోగాలు కూడా చేశాడు.
దానితో నా సోషల్ మీడియా హ్యాక్ చేయించి కూడా నన్ను లొంగదీసుకోవాలని చూశాడు. అతను నాతో చాట్ చేయడానికి వేర్వేరు నంబర్లు, అకౌంట్ నెంబర్స్ ఉపయోగించేవాడు. అంతటితో ఆగకుండా వారు పెద్ద మొత్తంలో నకిలీ టికెట్లు కొంటారు. కలెక్షన్లను కూడా తప్పుగా చూపిస్తారు. అలాగే పర్సనల్ విషయాలపై గూఢచర్యం చేస్తారు. వాట్సాప్ డేటాను కొనుగులో చేసి మన వ్యక్తిగత విషయాలపై ఎల్లప్పుడూ నిఘా పెడతారు. వాళ్లు కేవలం టాలెంట్ లేని స్టుపిడ్స్ కాదు. నేర ప్రవృత్తి ఉన్న భయంకరమైన నేరస్థులు. దయచేసి ముంబై సైబర్ క్రైమ్ యాక్షన్ తీసుకోండి” అంటూ ఆమె కోరింది.
ఇక సరిపెడితే చాలదు అనుకుందో ఏమో రణబీర్ కి పుట్టిన పాప గురించి కూడా కంగనా పేర్కొంది. అతని పెళ్లి ఒక ఫేక్. అతనికి పుట్టిన పాప సినిమాను ప్రమోట్ చేసే సాధానం అని తెలిసి నేను ఆశ్చర్యపోయాను. ఎవరైనా ఇంత అనైతికంగా ఉంటారా అని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అని కంగనా తెలిపింది.
“వాళ్లు మనుషులు కాదు. రాక్షసులు. అందుకే నేను వారిని నాశనం చేయాలని నిశ్చయించుకున్నాను. ధర్మం ముఖ్య ఉద్దేశం అధర్మాన్ని నాశనం చేయడమే. అదే భవద్గీత లో శ్రీ కృష్ణుడు చెప్పినట్లుగా. నేను అదే చేస్తున్నాను” అని కంగనా వెల్లడించింది.