డ్రాగన్ వక్ర బుద్ది... ఓ వైపు చర్చలు... మరో వైపు సరిహద్దుల వెంట నిర్మాణాలు....!
చైనా వక్ర బుద్ది మరోసారి బయట పడింది. తాజాగా దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, భారత ప్రధాని మోడీలు అనధికారికంగా భేటీ అయినట్టు వార్తలు వచ్చాయి. భారత్ కోరినందునే ఈ సమావేశం జరిగిందని చైనా చెప్పుకొచ్చింది. కానీ ఈ వాదనను భారత్ తోసి పుచ్చింది. భారత్ అలాంటి విజ్ఞప్తి చేయలేదని విదేశాంగ శాఖ వెల్లడించింది.