50 మీటర్ల రైఫిల్ విభాగంలో ఫైనల్కు దూసుకెళ్లిన స్వప్నిల్! పారిస్ ఒలింపిక్స్లో భారత్కు చెందిన స్వప్నిల్ 50 మీటర్ల రైఫిల్ విభాగంలో ఫైనల్కు దూసుకెళ్లాడు. మరోవైపు బ్యాడ్మింటన్ లో తెలుగు తేజం పీ.వి సింధు ఎస్టోనియా క్రీడాకారిణి క్రిస్టిన్ కుపాను ఓడించి తదుపరి రౌండ్ కు చేరుకుంది. By Durga Rao 31 Jul 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి పారిస్ ఒలింపిక్స్లో భారత్కు చెందిన స్వప్నిల్ 50 మీటర్ల రైఫిల్ విభాగంలో ఫైనల్కు దుసుకెళ్లాడు. మరోవైపు బ్యాడ్మింటన్ లో తెలుగు తేజం పీ.వి సింధు మ్యాచ్లో ఎస్టోనియా క్రీడాకారిణి క్రిస్టిన్ కుపాను ఓడించింది. స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు 2016 రియో ఒలింపిక్స్, 2021 టోక్యో ఒలింపిక్స్ రెండింటిలోనూ భారత జెండాను ఎగురవేసింది. రజతం, కాంస్యం రెండు పతకాలు సాధించిన పీవీ సింధు.. భారత్ తరఫున రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన తొలి క్రీడాకారిణిగా నిలిచింది. ఈసారి హ్యాట్రిక్ పతకం సాధించాలనే కలతో పీవీ సింధు రంగంలోకి దిగింది. తొలి రౌండ్లో మాల్దీవుల క్రీడాకారిణిని సులభంగా ఓడించిన పీవీ సింధు రెండో రౌండ్లో ఎస్టోనియా క్రీడాకారిణి క్రిస్టిన్ కుపాను ఓడించి తదుపరి రౌండ్ లోకి అడుగు పెట్టింది. #swapnil #2024-paris-olympics మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి