స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధ ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటీషన్లపై సుప్రీం కోర్టు సంచలన ప్రకటన చేసింది. ప్రతిఒక్కరికి తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు ఉంటుందని.. అందుకోసం ప్రభుత్వం కూడా స్వలింగ వివాహాలకు న్యాయపరమైన హోదా ఇవ్వాలంటూ సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోనే ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇద్దరు స్వలింగ సంపర్కుల మధ్య ఉన్న బంధంలో శారీరకంగానే ఎమోషనల్ అంశాలు కూడా ఉంటాయని జస్టీస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. సేమ్ సెక్స్, గే వివాహాలకు కేంద్రం చట్టబద్ధత కల్పించాలని ఆదేశించించారు. అలాగే స్వలింగ సంపర్కాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. హోమో సెక్సువాలిటీ కేవలం నగరాలు, ఉన్నతవర్గాలకు సంబంధించింది విషయం కాదని స్పష్టం చేశారు. ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలు అధికారాల విభజనకు అడ్డంకి కాదని పేర్కొన్నారు. ఈ కేసుపై పార్లమెంటే నిర్ణయం తీసుకోవాలన్న సీజేఐ.. అది న్యాయ సమీక్షకు లోబడి ఉండాలని తీర్పులో పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Supreme Court: సేమ్ సెక్స్ వివాహాలపై.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు
స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధ ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటీషన్లపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రతిఒక్కరికి తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు ఉంటుందని.. అందుకోసం ప్రభుత్వం కూడా స్వలింగ వివాహాలకు న్యాయపరమైన హోదా ఇవ్వాలంటూ సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.
Translate this News: