Sriranga Neethulu: ఓటీటీలోకి వచ్చేసిన 'శ్రీరంగనీతులు'... ఊహించని రెస్పాన్స్..!

హీరో సుహాస్, కార్తీక్ రత్నం, రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'శ్రీ‌రంగ‌నీతులు'. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఏప్రిల్ 11న విడుదలైన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, ఆహాలో స్ట్రీమవుతోంది.

New Update
Sriranga Neethulu:  ఓటీటీలోకి వచ్చేసిన 'శ్రీరంగనీతులు'... ఊహించని రెస్పాన్స్..!

Sriranga Neethulu:  టాలీవుడ్ యంగ్ టాలెంట్ హీరో సుహాస్ కార్తీక్ రత్నం, రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'శ్రీరంగనీతులు'. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి ప్ర‌వీణ్‌కుమార్ వీఎస్ఎస్ దర్శకత్వం వహించారు. రాధావి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి నిర్మించారు. ఏప్రిల్ 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.

publive-image

ఓటీటీలో శ్రీరంగనీతులు

అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇటీవలే ఈ సినిమాను నేరుగా యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఏకంగా రెండు ఓటీటీల్లో 'శ్రీరంగనీతులు' స్ట్రీమింగ్ అవుతోంది. . ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఆహా, అమెజాన్ ప్రైమ్ లో సక్సెస్ ఫుల్ దూసుకెళ్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ ట్రెండింగ్ సినిమాగా కొనసాగుతుంది ఈ చిత్రం. థియేటర్స్ కు మించిన రెస్పాన్స్ ఈ మూవీకి  ఓటీటీలో రావడం గమనార్హం. అంథాలజీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను థియేటర్స్ లో మిస్ అయిన వారు ప్రస్తుతం ఓటీటీలో ఎంజాయ్ చేయవచ్చు.

Also Read: Nivetha Pethuraj : పోలీసులకు దొరికిపోయిన నివేదా.. ఏంటని అడిగినందుకు గొడవ..! - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు