collector: కలెక్టర్‌కు ఇంత నిర్లక్ష్యం పనికిరాదు..మాజీ మంత్రి పేర్నినాని ఆగ్రహం

జిల్లా కలెక్టర్‌ తీరుపై పేర్ని నాని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా సర్వసభ్య సమావేశాలకు ఏలూరు కలెక్టర్‌ హాజరుకాకపోవడంపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు లేఖ రాయాలని జడ్పీ ఛైర్‌పర్సన్‌కు పేర్ని నాని సూచించారు. ఇలాగే ఉంటే సీఎం ఇంటి ముందు జడ్పీటీసీలతో నిరసన వ్యక్తం చేస్తామని లేఖలో రాయాలని చెప్పారు. అవసరమైతే జడ్పీ సమావేశంలో తీర్మానాన్ని చేయాలని పేర్ని నాని ఛైర్‌పర్సన్‌కు సూచించారు.అసలు జెడ్పీ మీటింగ్‌లకు వచ్చే ఉద్దేశం కలెక్టర్‌కు ఉందా లేదా? అని పేర్ని నాని ప్రశ్నించారు. ఇంత నిర్లక్ష్యం పనికిరాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
collector: కలెక్టర్‌కు ఇంత నిర్లక్ష్యం పనికిరాదు..మాజీ మంత్రి పేర్నినాని ఆగ్రహం

Such negligence does not work for the collector..Ex-minister is furious

సమావేశానికి రాలేదని ఆగ్రహం

అయితే నిన్న ఉమ్మడి క్రిష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ఆర్కే రోజా, జెడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పాల హారిక, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, కొత్త జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ఇతరులు హాజరైయ్యారు. గతంలో క్రిష్ణా జిల్లాలో ఉన్న కైకలూరు, నూజివీడు నియోజకవర్గాలు జిల్లాల విభజన తర్వాత ప్రస్తుతం ఏలూరు జిల్లాలో భాగంగా ఉన్నాయి. కాబట్టి ఉమ్మడి కృష్ణా జెడ్పీ సమావేశానికి ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కూడా హాజరు కావాల్సి ఉంది. గతంలోనూ ఆయన జెడ్పీ సర్వసభ్య సమావేశానికి హాజరు కాలేదు. దీంతో ఇవాళ్టి సమావేశానికి కూడా రాకపోవడంతో పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తీర్మానం చేయాలి

ఏలూరు కలెక్టర్ ప్రసన్నం వెంకటేష్ మరోసారి జెడ్పీ సమావేశానికి రాకపోతే కనుక జిల్లాకు చెందిన జెడ్పీటీసీ మెంబర్లందరితో కలిసి తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటి వద్ద ధర్నా చేస్తామంటూ పేర్నినాని అందరి ముందే వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై సమావేశంలో తీర్మానం కూడా చేయాలని పేర్నినాని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏలూరు జిల్లా కలెక్టర్‌కు లేఖ రాయలి జెడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పాల హారికను కోరారు.

సీఎం ఇంటి వద్ద నిరసన చెస్తాం

ఉమ్మడి కృష్ణా జిల్లాలో గతంలో ఉన్న నియోజకవర్గాలు ఇప్పుడు ఏలూరు జిల్లాలోకి వెళ్లడంతో ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు సమావేశాలకు హాజరవుతున్నారని, అదే విధంగా నియోజకవర్గాలకు సంబంధించిన జడ్పీటీసీ సభ్యులు, ఎమ్మెల్యేలు వాళ్ల సమస్యలను ఎవరికి వివరించాలని పేర్ని నాని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు ఇక్కడకు వచ్చి ఉత్సవ విగ్రహాల్లా కూర్చోడానికా? ఎందుకనుకుంటున్నారని ఆయన నిలదీశారు. గతంలో కూడా ఈ సమావేశాలకు జిల్లా కలెక్టర్, అధికారులు ఎవరూ రాకపోవడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కలెక్టర్ ఈ సమావేశాలకు వచ్చే ఉద్దేశం లేకపోతే చెప్పాలన్నారు. ఈసారి సమావేశానికి రాకపోతే జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరం కలిసి సీఎం ఇంటికి వెళ్తామని, బయట కూర్చోని నిరసన తెలుపుతామని పేర్నినాని స్పష్టం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు