Crime News : గురుకులంలో విషమంగా ఇద్దరు విద్యార్థుల పరిస్థితి.. అనుమానాస్పదంగా మరో విద్యార్థి మృతి..!

జగిత్యాల జిల్లా పెద్దపూర్ గురుకులంలో పాము కాటుకు ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. అయితే, ఇదే రూములో పడుకున్న మరో విద్యార్థి అదే సమయంలో చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.

New Update
Crime News : గురుకులంలో విషమంగా ఇద్దరు విద్యార్థుల పరిస్థితి.. అనుమానాస్పదంగా మరో విద్యార్థి మృతి..!

Jagtial : జగిత్యాల జిల్లా పెద్దపూర్ గురుకుల స్కూల్ హాస్టల్లో (Gurukul School Hostel) పడుకున్న ఇద్దరు విద్యార్థులను పాము కాటు (Snake Bite) వేయగా పరిస్థితి విషమంగా ఉంది. అయితే, అదే రూములో పడుకున్న మరో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెట్ పల్లికి చెందిన హర్షవర్ధన్ (14), ఇబ్రహీంపట్నం మండలం ఫకీర్ కొండాపూర్ గ్రామానికి చెందిన ఆడేపు గణేశ్ (14) పెద్దాపూర్ గురుకుల స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. గురువారం రాత్రి హాస్టల్ రూంలో పడుకోగా అర్ధరాత్రి 3. గంటల టైంలో హర్షవర్ధన్, గణేశ్ చేతులపై ఏదో కాటేసినట్టు గుర్తించారు. అయితే, ఏదో పురుగు కావచ్చని అనుకుని అలాగే పడుకున్నారు.

ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో తీవ్ర అస్వస్థతకు గురవడంతో తోటి విద్యార్థులు కేర్ టేకర్ కు సమాచారమిచ్చారు. వారు వచ్చిచూసి నీళ్లు తాగిపించినా, ఏదైనా తినిపించినా తినలేదు. దీంతో వారిని ఉదయం ఆరు గంటలకు మెట్పల్లి సివిల్ హాస్పిటల్ తీసుకువెళ్లారు. విద్యార్థుల చేతులపై ఉన్న గాట్లు చూసి పాము కాటు వేసిందని డాక్టర్లు నిర్ధారించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో గుర్తింపు హాస్పటల్ కు తరలించారు. కాగా, ఈ విషయంలో ప్రిన్సిపాల్, కేర్ టేకర్.. విద్యార్థులకు కనీస ట్రీట్మెంట్ ఇప్పించకుండా, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే.. ఇదే గురుకులంలో ఎనిమిదో తరగతి చదువుతూ పాము కాటు వేసిన రూములోనే పడుకున్న మరో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మెట్ పల్లిలోని ఆరపేటకు చెందిన రాజారపు మహేశ్, లావణ్య దంపతుల చిన్న కొడుకు ఘనాదిత్య (13)ను శుక్రవారం తెల్లవారుజామున స్టడీ అవర్, వ్యాయామం కోసం వార్డెన్, కేర్ టెకర్ నిద్ర లేపగా లేవలేదు. ఈ విషయంపై స్టూడెంట్ తండ్రికి చెప్పగా వెంటనే వచ్చి హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. పరీక్షించిన డాక్టర్ అప్పటికే చనిపోయాడని చెప్పాడు.

పిల్లాడి ఆరోగ్యం గురించి ప్రిన్సిపాల్, వార్డెన్పట్టించు కోకపోవడం వల్లే ఘనాదిత్య చనిపోయాడని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు హాస్టల్ కు చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోరుట్ల ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. కాగా, మహేశ్ దంపతులకు పెండ్లయిన ఏడాదికే పుట్టిన కొడుకు అనారోగ్యంతో చనిపోగా, ఐదేండ్లకు పుట్టిన మరో కొడుకు కూడా కన్నుమూశాడు. మూడో కొడుకు అయిన ఘనాదిత్య కూడా కన్నుమూయడంతో ఆ తల్లి దండ్రులకు అంతులేని ఆవేదనే మిగిలింది.

Also Read : ఏపీకి ఐపీఎస్‌ కేడర్‌ స్ట్రెంత్‌పై కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌



Advertisment
తాజా కథనాలు