Stock Market: స్టాక్ మార్కెట్ రికార్డ్ పరుగులకు బ్రేక్.. 

పైపైకి దూసుకు వెళుతున్న స్టాక్ మార్కెట్ దూకుడుకు ఈరోజు బ్రేకులు పడ్డాయి. సెన్సెక్స్ 199 పాయింట్ల పతనంతో 73,128 వద్ద..  నిఫ్టీ కూడా 65 పాయింట్లు పతనమై22,031 వద్ద ముగిసింది.

New Update
Stock Market: ఎలక్షన్ రిజల్ట్స్ ఎఫెక్ట్.. ఇన్వెస్టర్ల సంపద 21 లక్షల కోట్లు ఢమాల్!

Stock Market Today: స్టాక్ మార్కెట్ రికార్డ్ పరుగులకు బ్రేకులు పడ్డాయి. శుక్ర, సోమవారాల్లు రెండురోజులూ పరుగులు తీసిన స్టాక్ మార్కెట్ ఈరోజు అంటే జనవరి 16న కిందికి పడింది. సెన్సెక్స్ (Sensex) 199 పాయింట్ల పతనంతో 73,128 వద్ద ముగిసింది. అదే సమయంలో నిఫ్టీ (Nifty) కూడా 65 పాయింట్లు పతనమైంది. 22,031 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 19 క్షీణించగా, 11 షేర్లు లాభపడ్డాయి. ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో (Banking Shares) మరింత క్షీణత కనిపించింది. అంతకుముందు నిన్న అంటే జనవరి 15న స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైని నమోదు చేసింది.

జ్యోతి CNC ఆటోమేషన్ షేర్లు 12% ప్రీమియంతో రూ. 370 వద్ద మార్కెట్‌లో లిస్ట్ అయ్యాయి. అయితే, ర్వాత అది మరింత పెరిగి రూ.103.20 (31.18%) లాభంతో రూ.434.20 వద్ద ముగిసింది. దీని షేర్ల ఇష్యూ ధర రూ.331.

మెడి అసిస్ట్ హెల్త్‌కేర్ సర్వీసెస్ IPOలో పెట్టుబడి పెట్టే అవకాశం
ప్రారంభ పబ్లిక్ ఆఫర్ అంటే మెడి అసిస్ట్ హెల్త్‌కేర్ సర్వీసెస్ లిమిటెడ్ IPO పబ్లిక్ సబ్‌స్క్రిప్షన్ కోసం ఓపెన్ అయింది.  జనవరి 17 వరకు ఇందులో పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.1,171.58 కోట్లు సమీకరించాలనుకుంటోంది. ఈ IPO కోసం, రిటైల్ ఇన్వెస్టర్ కనీసం ఒక లాట్ అంటే 35 షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి. కంపెనీ IPO ప్రైస్ బ్యాండ్‌ను ఒక్కో షేరుకు ₹397-₹418గా నిర్ణయించింది.

Also Read: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ప్రయత్నించిన వివేక్ రామస్వామి ఎవరు?

మీరు ₹ 418 IPO ఎగువ ధర బ్యాండ్ ప్రకారం 1 లాట్ కోసం దరఖాస్తు చేస్తే, మీరు ₹ 14,630 పెట్టుబడి పెట్టాలి. రిటైల్ పెట్టుబడిదారులు గరిష్టంగా 13 లాట్‌లకు అంటే 455 షేర్లకు వేలం వేయవచ్చు, దీని కోసం వారు ₹ 190,190 పెట్టుబడి పెట్టాలి.

నిన్న మార్కెట్ ఆల్ టైమ్ హైని నమోదు చేసింది.

అంతకుముందు Stock Market నిన్న అంటే సోమవారం కూడా స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైని నమోదు చేసింది. ట్రేడింగ్ సమయంలో, సెన్సెక్స్ 73,402 మరియు నిఫ్టీ 22,115 ను తాకాయి. తర్వాత స్వల్పంగా క్షీణించి సెన్సెక్స్ 759 పాయింట్లు ఎగబాకి 73,327 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 202 పాయింట్లు పెరిగి 22,097 వద్ద ముగిసింది.  

WATCH:

Advertisment
తాజా కథనాలు