Sri Chaitanya: ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ 2024.. శ్రీచైతన్య విద్యార్థికి బంగారు పతకం!

ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ 2024లో శ్రీచైతన్య టెక్నో స్కూల్ విద్యార్థి ఆదిత్య బంగారు పతకం సాధించాడు. యునైటెడ్ కింగ్డమ్ బాత్లో జరిగిన 65వ మ్యాథ్స్ ఒలింపియాడ్‌లో శ్రీచైతన్య విద్యార్థి బృందం నాలుగో స్థానంలో నిలిచింది. ప్రధాని మోదీ విద్యార్థులపై ప్రశంసలు కురిపించారు.

New Update
Sri Chaitanya: ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ 2024.. శ్రీచైతన్య విద్యార్థికి బంగారు పతకం!

2024 International Mathematical Olympiad: విద్యారంగంలో అగ్రగామిగా నిలుస్తూ ఎందరో విద్యార్థులను విశ్వవిజేతలుగా తీర్చిదిద్దుతున్న శ్రీచైతన్య విద్యాసంస్థలు మరో మైలురాయిని అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వేల మంది ప్రతిభ గల విద్యార్థులు పోటీపడిన ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ 2024లో భారత జట్టు అద్భుతమైన ప్రతిభాపాటవాలు ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానంలో నిలిచింది.

ఆరుగురు విద్యార్థుల భారత బృందం..
యునైటెడ్ కింగ్డమ్ లోని బాత్లో ఇటీవల ముగిసిన 65వ ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ లో భారతదేశానికి చెందిన ఆరుగురితో కూడిన విద్యార్ధి బృందం నాలుగు బంగారు పతకాలు ఒక రజిత పతకంతో ప్రపంచంలోనే నాలుగొవ ర్యాంకులో నిలిచింది. ఈ ఆరుగురు విద్యార్థులు ఉన్న భారత బృందంలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ బావదాన్ పూణే కు చెందిన విద్యార్థి ఎం.వి ఆదిత్య అత్యుత్తమ ప్రతిభ కనబరచడం విశేషం.

అసాధారణమైన విజయం మోదీ..
ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు శ్రీచైతన్య టెక్నో స్కూల్ విద్యార్థి ఆదిత్య మాంగుడిని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్లో భారత్ అత్యుత్తమ ప్రదర్శనలో 4వ స్థానానికి చేరుకోవడం ఎంతో సంతోషం, గర్వించదగ్గ విషయమన్నారు. మా బృందం నాలుగు స్వర్ణాలు, ఒక రజత పతకాన్ని ఇంటికి తీసుకువచ్చింది. ఈ ఫీట్ అనేక ఇతర యువకులకు స్ఫూర్తినిస్తుంది. గణితాన్ని మరింత ప్రాచుర్యం పొందడంలో సహాయపడుతుందని, ఈ అసాధారణమైన విజయం దేశానికి గర్వకారణం అంటూ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థి ఎం.వి అదిత్య, ఇతర విద్యార్థి బృందానికి మోదీ అభినందనలు తెలిపారు.

ఈ విజయం సాధించి భారతదేశాన్ని ప్రపంచంలో నాలుగో స్థానంలో నిలబెట్టిన ఈ ఆరుగురు విద్యార్థులకు శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ శ్రీమతి సుష్మ, శ్రీచైతన్య స్కూల్స్ అకడమిక్ డైరెక్టర్ శ్రీమతి సీమ అభినందనలు తెలిపారు. ఈ ఆరుగురు విద్యార్థుల బృందంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఎం.వి ఆదిత్య శ్రీ చైతన్య టెక్నో స్కూల్ పూణే భావధాన్ విద్యార్థి కావడం తమకెంతో సంతోషం కలిగిస్తోందని అన్నారు. ఆదిత్య మాంగుడి 6వ తరగతి నుంచే శ్రీచైతన్య టెక్నో స్కూల్ విద్యార్థి అని, ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్నాడని, ఐఎంఓ 2024లో బంగారు పతకం సాధించడం వెనుక స్కూల్ స్థాయి నుంచే ఆదిత్య అంకితభావం, కృషి, అసాధారణమైన ప్రతిభ ఉన్నాయని కొనియాడారు. జాతీయస్థాయి పోటీ పరీక్షల్లోనే కాకుండా నాసా, ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ లో సైతం శ్రీ చైతన్య విద్యార్థులు సత్తా చాటుకోవడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా శ్రీచైతన్య విద్యార్థులు వరుసగా సాధించిన విజయాలను గుర్తు చేశారు. 2001లో జరిగిన ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ భారతదేశం తరపునుంచి శశాంక్ శర్మ ఏడో స్థానంలో నిలిచారు. అయితే 23 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ లో ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానాన్ని సొంతం చేసుకున్న భారత విద్యార్ధి బృందంలో కీలక భూమిక పోషించిన ఆదిత్య శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థి కావడం గర్వంగా ఉందని అన్నారు.

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Israel-gaza: గాజాలో మారణహోమం.. మరో 27 మంది మృతి

గాజాలో మానవతా సహాయ కేంద్రం వద్ద ఇజ్రాయెల్ దళాలు మరోసారి దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్ది ప్రజలు గాయాలపాలయ్యారు. గత 3 రోజుల నుంచి సహాయ కేంద్రాల వద్ద ఈ దాడులు జరుగుతున్నాయి.

New Update
At least 27 Palestinians killed by Israeli fire near aid centre, Gaza authorities say

At least 27 Palestinians killed by Israeli fire near aid centre, Gaza authorities say

గాజాపై ఇజ్రాయెల్‌ భీకర దాడులు కొనసాగిస్తూనే ఉంది. గత కొన్నిరోజులుగా జరుగుతున్న దాడుల వల్ల గాజాలో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మానవతా సహాయ కేంద్రం వద్ద IDF దళాలు మరోసారి దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్ది ప్రజలు గాయాలపాలయ్యారు.  ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం గాజా దక్షిణ ప్రాంతంలోని సహాయ కేంద్రం దగ్గర మానవతా సాయం పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. 

Also Read: ఇకనుంచి ఒకటవ తరగతి నుంచే బేసిక్‌ మిలిటరీ శిక్షణ !

ఇదే సమయంలో ఇజ్రాయెల్ కాల్పులకు దిగింది. ఈ దాడుల్లో 27 మంది అమాయకులు మృత్యువాతపడ్డారు. గత 3 రోజుల నుంచి సహాయ కేంద్రాల వద్ద ఈ దాడులు జరుగుతున్నాయి. ప్రస్తుతం వేలాది మంది పాలస్తీనియన్లు అక్కడ మానవతా సాయం తీసుకోవడం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలోనే ఇజ్రాయెల్ దాడులు జరపడం కలకలం రేపుతోంది. ఆకలితో అలమటిస్తున్న గాజా పౌరులపై ఇజ్రాయెల్ దాడులు చేయడాన్ని హమాస్‌ తీవ్రంగా ఖండించింది. 

మరోవైపు రఫాలోని తమ ఆస్పత్రిలో ఇప్పటిదాకా 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీ ప్రతినిధి వెల్లడించారు. 19 మంది అక్కడికి వెళ్లే లోపు మృతి చెందినట్లు తెలిపారు. మరికొందరికి తక్షణమే వైద్యం అవసరం ఉందని పేర్కొన్నారు. ఇదిలాఉండగా 2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై హమాస్‌ మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి హమాస్ అంతమే లక్ష్యాంగా ఇజ్రాయెల్‌ గాజాపై విరుచుకుపడుతోంది. 

Also Read: యుద్ధాల్లో దుమ్ము రేపుతోన్న డ్రోన్లు.. వేల కి.మీ దాటి శత్రువులపై దాడులు

ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న పోరులో ఇప్పటిదాకా గాజాలో 54 వేల మందికి పైగా మృతి చెందినట్లు అక్కడి స్థానిక యంత్రాంగం తెలిపింది. ఇటీవలే అక్కడ మానవతా సాయాన్ని పరిమితంగా అందించేందుకు ఇజ్రాయెల్ పర్మిషన్ ఇచ్చింది. అయితే ఈ సమయంలో కూడా అక్కడ దాడులు జరగడం కలకలం రేపుతోంది. 

telugu-news | rtv-news | israel | gaza

Advertisment
Advertisment