Free Bus Scheme In Telangana : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధికారంలో వచ్చిన తరువాత మహాలక్ష్మి పథకం(Mahalakshmi Scheme) కింద మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కలిపించిన విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా మహిళల నుంచి మంచి స్పందన లభిస్తుంది. బస్సుల్లో ప్రయాణం చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. బస్సుల్లో రద్దీ కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బస్ స్టాండులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఈ పథకంతో మహిళలు ఆనందంగా ఉన్న పురుషులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కలిపించడం వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని.. ప్రయాణించేందుకు సీట్లు కూడా దొరకడం లేదని తమ బాధను చెప్పకనే చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..TSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. పురుషులకు ప్రత్యేక బస్సులు?
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలిపించడం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. ఈ క్రమంలో తమకు సీట్లు కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలోని పురుషులు. తమ కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Translate this News: