Trains Cancelled: ఈ రోజు నుంచి తిరుపతి, కడపతో పాటు ఆ రైళ్లన్నీ రద్దు.. లిస్ట్ ఇదే!

నిర్వహణ కారణాలతో పలు మొత్తం 4 రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. 06401, 06402, 07657, 07658 నంబర్ గల రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయి.

Trains Cancelled: ఈ రోజు నుంచి తిరుపతి, కడపతో పాటు ఆ రైళ్లన్నీ రద్దు.. లిస్ట్ ఇదే!
New Update

దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా కీలక ప్రకటన చేసింది. నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు (Trains Cancel) చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Train No.06401: అరక్కోణం-కడప ట్రైన్ ను ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే.
Train No.06402: కడప-అరక్కోణం ట్రైన్ ను సైతం ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు రద్దు చేశారు.
Train No.07657: తిరుపతి-హుబ్బాళి ట్రైన్ ను కూడా ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు క్యాన్సెల్ చేశారు.
Train No.07658: హుబ్బళి-తిరుపతి ట్రైన్ కూడా రద్దైన రైళ్ల జాబితాలో ఉంది. ఈ ట్రైన్ ను ఈ నెల 23 నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు రద్దు చేశారు.

ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌ నుంచి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ సర్వీస్(Vande Bharat Express) ప్రారంభం కానుంది. ఈ ట్రైన్ హైదరాబాద్(Hyderabad) – బెంగళూరు(Bengaluru) మధ్య నడవనుంది. సెప్టెంబర్ 24న ఈ ట్రైన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఈ ట్రైన్‌కు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కాచిగూడ నుంచి యశ్వంత్‌పూర్(బెంగళూరు) మధ్య ఈ వందేభారత్ ట్రైన్ నడవనుంది. ఈ ట్రైన్‌ను ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఇకపోతే.. కాచిగూడ రైల్వే స్టేషన్‌లో జరిగే ఈ ప్రారంభోత్సవ కార్య్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy), రైల్వే ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
ఇది కూడా చదవండి: Vande Bharat Express: కాచిగూడ నుంచి మరో ‘వందేభారత్’ ట్రైన్ సర్వీస్ ప్రారంభం.. పూర్తి వివరాలివే..

ట్రైన్ టైమింగ్స్ ఇవీ..

ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ సోమవారం నుంచి కాచిగూడలో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి.. మహబూబ్‌నగర్‌, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం స్టేషన్ల మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్‌పూర్‌ చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి.. రాత్రి 11.15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది ఈ ట్రైన్. ఇదిలాంటే.. కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్‌తో పాటు.. ఇదే రోజున మరో 9 వందేభారత్ ట్రైన్ సర్వస్లను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. వీటిలో విజయవాడ-చెన్నై వందేభారత్‌ కూడా ఉండటం విశేషం. ఈ రైలు విజయవాడ నుంచి తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా చెన్నై సెంట్రల్‌ వరకు నడుస్తుంది. వారంలో గురువారం ఒక్క రోజు తప్ప మిగిలిన అన్ని రోజుల్లో ఈ ట్రైన్ నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. కాగా, ఈ ట్రైన్ ప్రతి రోజూ(గురువారం మినహా) ఉదయం 5.30 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.10 గంటలకు కి చెన్నై చేరుకుంటుంది. తిరిగి చెన్నైలో మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరి విజయవాడకు రాత్రి 10 గంటలకు వస్తుంది.

#indian-railways #south-central-railway
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి