PM Modi: కొడుకు కోసం సోనియా గాంధీ ఓట్లు అడుగుతున్నారు.. ప్రధాని మోదీ ఫైర్

సోనియా గాంధీ కోవిడ్ తర్వాత ఒక్కసారి కూడా తన నియోజకవర్గమైన రాయ్‌బరేలీని సందర్శించలేదని అన్నారు మోదీ. ఇప్పుడు ఆమె తన కొడుకు కోసం ఓట్లు అడుగుతున్నారని ఫైర్ అయ్యారు. వారు రాయ్‌బరేలీ సీటును తమ కుటుంబ ఆస్తిగా భావిస్తారని చురకలు అంటించారు.

Elections 2024 : ఎక్కడ ప్రచారం చేశారో అక్కడ ఓటమి.. మహారాష్ట్రలో పని చేయని మోదీ చరిష్మా
New Update

PM Modi: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీపై విమర్శల దాడికి దిగారు ప్రధాని మోదీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు రాయ్‌బరేలీలో పర్యటించారు. బీజేపీ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. రాయ్‌బరేలీని వదిలిపెట్టి తన కుమారుడు రాహుల్ గాంధీని తన లోక్‌సభ స్థానంలో నామినేట్ చేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని చూస్తుందని అన్నారు.

జంషెడ్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “సోనియా గాంధీ ప్రచారానికి రాయ్‌బరేలీకి వెళ్లి, తన కొడుకును వారికి అప్పగిస్తున్నానని చెప్పారు. రాయ్‌బరేలీలో ఎక్కువ కాలం పనిచేసిన ఒక్క పార్టీ కార్యకర్త కూడా కనిపించలేదా అని అన్నారు.

"సోనియా గాంధీ కోవిడ్ తర్వాత ఒక్కసారి కూడా తన నియోజకవర్గాన్ని సందర్శించలేదు, ఇప్పుడు ఆమె తన కొడుకు కోసం ఓట్లు అడుగుతున్నారు. వారు సీటును తమ కుటుంబ ఆస్తిగా భావిస్తారు" అని ఫైర్ అయ్యారు.

శనివారం సోనియా గాంధీ తన పూర్వ నియోజకవర్గమైన రాయ్‌బరేలీలో తన పిల్లలు రాహుల్, ప్రియాంకలతో కలిసి ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు . కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు తన కుమారుడిని (రాహుల్ గాంధీ) రాయ్‌బరేలీకి అప్పగిస్తున్నానని, "అతను మిమ్మల్ని నిరాశపరచడు" అని అన్నారు.

రెండు లోక్‌సభ స్థానాలపై పోటీ చేస్తున్న రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ మండిపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ యువరాజు వయనాడ్ నుంచి రాయబరేలీకి పారిపోయారని, ఇది నా తల్లి సీటు అని అందరికీ చెబుతూ తిరుగుతున్నారని అన్నారు.

#pm-modi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి