Sobhita Dhulipala: 'కాల్ గర్ల్' గా మారిన 31 ఏళ్ళ తెలుగు హీరోయిన్.. కారణం ఇదే..!

హాలీవుడ్ రేంజ్‌లో క్రేజ్ దక్కించుకున్నతెలుగు నటి శోభిత ధూళిపాళ్ల. ఇటీవలే హాలీవుడ్ ఫిల్మ్ 'మంకీ మ్యాన్' చిత్రంలో కాల్ గర్ల్ పాత్రలో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ రేంజ్ కి ఎదిగిన ఈమె గురించి ఇప్పుడు తెలుసుకుందాము.

Sobhita Dhulipala: 'కాల్ గర్ల్' గా మారిన 31 ఏళ్ళ తెలుగు హీరోయిన్.. కారణం ఇదే..!
New Update

Sobhita Dhulipala: మోడలింగ్ తో కెరీర్ మొదలు పెట్టిన శోభిత దూళిపాళ్ల 2013లో మిస్ ఇండియా అందాల పోటీల్లో రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ 'రామన్ రాఘవ్ 2.0' హిందీ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైంది.

Sobhita Dhulipala

2018 లో అడివి శేష్ హీరోగా నటించిన గూఢచారి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో అందరి దృష్టి ఆమె పై పడింది. ఆ తర్వాత 'ది నైట్ మేనేజర్', 'మేడ్ ఇన్ హెవెన్' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు, వెబ్ సిరీస్‌లలో కనిపించిన 31 ఏళ్ల బ్యూటీ టాలీవుడ్ నుంచి హాలీవుడ్ రేంజ్ కు ఎదిగిపోయింది.

Sobhita Dhulipala

ఇటీవలే 'మంకీ మ్యాన్' చిత్రంతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

Sobhita Dhulipala

మంకీ మ్యాన్' సినిమాలో 'కాల్ గర్ల్' పాత్రలో (వేశ్య) కనిపించిన శోభిత తన నటనతో హాలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న శోభిత మంకీ మ్యాన్' లో ఆమె చేసిన కాల్ గర్ల్ పాత్ర పై ఆసక్తికర విషయాలను పంచుకుంది.

publive-image

నటి శోభిత మాట్లాడుతూ.. 'మంకీ మ్యాన్' లో కాల్ గర్ల్ (సీత) పాత్రలో నటించడం గొప్పగా భావిస్తున్నాని అన్నారు. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకమైందని, ఆ పాత్రతో తాను పూర్తిగా సంతృప్తి చెందానని తెలిపారు. అలాంటి క్యారెక్టర్ లో నటించిన తర్వాత గర్వంగా ఉందని పేర్కొన్నారు.

publive-image



Also Read: Oscars 2025: 97వ ఆస్కార్‌ అవార్డుల వేడుక ఆ రోజే.. డేట్ అనౌన్స్ చేసిన అకాడమీ

#sobhita-dhulipala
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe