Stree 2: భయపెడుతున్న 'స్త్రీ 2' ట్రైలర్.. త‌ల‌లేని రాక్ష‌సుడి గుప్పిట్లో చందేరి ప్ర‌జ‌లు..!

రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన హారర్ కామెడీ చిత్రం 'స్త్రీ-2'. 2018లో విడుదలైన సూపర్ హిట్ 'స్త్రీ' సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతుంది. తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. హర్రర్ నేపథ్యంలో సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతోంది.

New Update
Stree 2: భయపెడుతున్న 'స్త్రీ 2' ట్రైలర్.. త‌ల‌లేని రాక్ష‌సుడి గుప్పిట్లో చందేరి ప్ర‌జ‌లు..!

Stree 2: శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'స్త్రీ'. 2018 లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. 30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం భారత్‌లో 129.83 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 182 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా 'స్త్రీ 2' రాబోతుంది. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్ ఆగస్టు 15న విడుదల కానుంది.

స్త్రీ 2 ట్రైలర్

ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. హర్రర్ కామెడీ నేపథ్యంలో సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతోంది. ట్రైలర్ గమనిస్తే.. ఈ సినిమా చందేరి అనే గ్రామం చుట్టూ తిరుగుతుంది. మొదటి భాగంలో ఓ 'స్త్రీ' అనే దెయ్యం గోడల పై 'ఓ స్త్రీ రేపు రా' అనే రాతలతో ప్రజలను భయపెట్టడం చూపించారు. ఇప్పుడు స్త్రీ 2 లో ఆ దెయ్యం ఊరు విడిచిపెట్టి వెళ్లినట్లుగా ట్రైలర్ లో చూపించారు. దీంతో చందేరి ప్రజలు సంతోషంగా ఉండగా.. మరో కొత్త సమస్య మొదలవుతుంది. ఆ గ్రామానికి త‌ల‌లేని రాక్ష‌సుడు ఏంట్రీ ఇస్తాడు. మరో వైపు రాజ్ కుమార్, శ్రద్ధ మధ్య సన్నివేశాలు చూపించారు. అసలు 'స్త్రీ' అనే దెయ్యానికి రాజ్ కుమార్ కు సంబంధం ఏంటీ..? తలలేని రాక్షసుడు నుంచి చందేరి ప్రజలను కాపాడడానికి ఎవరు వస్తారు..? అనేది సినిమాలో తెలుస్తుంది.

ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా తదితరులు కీలక పాత్రలు పోషించారు. టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

Also Read: Nita Ambani: నీతా అంబానీ ధరించిన ఈ లెహంగాను ఎన్ని రోజులు డిజైన్ చేశారో తెలుసా..! - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు