చాలా ప్రయోగాల అనంతరం ముంబైలోని ఎంటోడ్ ఫార్మాస్యూటికల్స్ ఒక కొత్త కంటి చుక్కలు ప్రెస్వ్యూ అందుబాటులోకి తీసుకువచ్చింది. రీడింగ్ గ్లాసెస్ అవసరం లేకుండా ఐ డ్రాప్స్ ద్వారా కంటి చూపును మెరుగుపర్చుకోవచ్చని చెబుతోంది. 270 మంది రోగుల మీద ప్రయోగం చేసామని…మూడు దశల్లో క్లినికల్ టెస్ట్లు చేసి సక్సెస్ అయ్యామని తెలిపింది. ఇది సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆమోదం కూడా పొందిందని చెప్పింది. అక్టోబర్ నుంచి ఈ కంటి చుక్కల మందు ప్రజలకు అందుబాటులోకి వస్తుందని చెప్పారు ఎంటోడ్ ఫార్మాస్యూటికల్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) నిఖిల్ K మసుర్కర్. రీడింగ్ గ్లాసెస్ను ఈ మందు పూర్తిగా తొలగిస్తుందని అంటున్నారు. అయితే దీనిని డాక్టర్లు రికమెండ్ చేశాకనే వాడాలని సూచించారు.
పూర్తిగా చదవండి..PresVu Eye Drop: రీడింగ్ గ్లాసెస్కు బదులు ప్రెస్వూ ఐ డ్రాప్స్..నిజంగానే పని చేస్తున్నాయా?
రీడింగ్ గ్లాసెస్ కు బదులు ఐడ్రాప్స్ వేసుకుంటే చాలు అంటోంది ఎంటోడ్ ఫార్మాస్యూటికల్స్. దీనికి సంబంధించి ముంబైలో మొట్టమొదట సారిగా రీడింగ్ గ్లాసెస్లా పని చేసే ప్రెస్వ్యూ ఐ డ్రాప్స్ను ప్రారంభించింది. మరి దీని ప్రభావం ఎలా ఉంది? డాక్టర్లు ఏమంటున్నారు? ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి..
Translate this News: