Kavitha: ఎమ్మెల్సీ కవితకు డబుల్ బిగ్ షాక్

ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఆగస్టు 9 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఈడీ కేసులో ఆగస్టు 13 వరకు జ్యుడిషియల్ రిమాండ్‌ను పొడిగించింది.

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్
New Update

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఆగస్టు 9 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కూడా కస్టడీని పొడిగించింది. తదుపరి విచారణను ఆగస్టు 9కి వాయిదా వేసింది. కాగా గడువు ముగియడంతో.. ముగ్గురిని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టులో హాజరుపరిచారు అధికారులు. మరోవైపు ఈడీ కేసులోని ఎమ్మెల్సీ కవిత కు షాక్ తగిలింది. ఈడీ కేసులో ఆమె జ్యుడిషియల్ కస్టడీని ఆగస్టు 13వరకు పొడిగించింది. కోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు.

#mlc-kavitha
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe