Shanthi Husband: నా భార్య అతనితోనే బిడ్డను కన్నది.. ఆధారాలు బయటపెట్టిన మదన్ మోహన్!

వైసీపీ నేత విజయసాయిరెడ్డి వల్లే తన భార్య శాంతి గర్భం దాల్చిందంటూ మదన్ మోహన్ సంచలన ఆరోపణలు చేశాడు. విజయసాయిరెడ్డి పిల్లలు కావాలని అడిగితే బాబును కనిపెట్టానని స్వయంగా శాంతి తనతో చెప్పినట్లు పలు ప్రూఫ్స్ బయటపెట్టాడు. డీఎన్‌ఏ టెస్ట్ కు రావాలంటూ సవాల్ విసిరాడు.

Shanthi Husband: నా భార్య అతనితోనే బిడ్డను కన్నది.. ఆధారాలు బయటపెట్టిన మదన్ మోహన్!
New Update

Shanthi - Madan Mohan: ఏపీ దేవాదాయ శాఖ మహిళా అసిస్టెంట్ కమిషనర్‌ శాంతి, మాజీ భర్త మదన్ మోహన్ ల వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఆదివారం ప్రెస్ మీట్ పెట్టి తనను కావాలనే మదన్ మోహన్ టార్చర్ చేస్తున్నాడంటూ శాంతి కన్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే. కాగా ఆ బిడ్డకు తాను తండ్రిని కాదంటూ సోమవారం మీడియా ముందు మదన్ మోహన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

విదేశాల్లో ఉండగానే ఆయనతో.. 
ఈ మేరకు అయితే వైసీపీ నేత విజయసాయిరెడ్డి (Vijaysai Reddy) వల్లే తన భార్య గర్భం దాల్చిందని మదన్ మోహన్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మీటింగ్ లో ఆరోపించారు. ఐవీఎఫ్ ద్వారా తాను ఒక బిడ్డను కన్నానని భార్య శాంతినే స్వయంగా చెప్పింది. విజయసాయికి పిల్లలు లేరు. ఒక ఆడపిల్లను పెంచుకున్నారు. ఆయన పిల్లలు కావాలని నన్ను అడిగారు. విజయసాయిరెడ్డి అంటే నాకు ఇష్టం. నేనంటే ఆయనకు ఇష్టం. బాబు కావాలని అడిగారు. అందుకే బేబీని కనిపెట్టాను అని శాంతి చెప్పింది. దాంతో నాకు గుండెలు పగిలిపోయాయి. ఐవీఎఫ్ డాక్యుమెంట్స్ చూపించమని అడిగితే హై ప్రొఫైల్ వ్యక్తులతో ఐవీఎఫ్ చేయించుకున్నా అని చెప్పింది. జనవరి నుంచి శాంతి నన్ను టార్చర్ చేస్తోంది. ఇది ఐవీఎఫ్ కాదు.. ఫిజికల్ రిలేషన్ షిప్ అని నిలదీశా. అవును హై ప్రొఫైల్ వ్యక్తి అని చెప్పింది. శాంతి నా పరువు తీసేసింది. ఐవీఎఫ్‌తో బాబును కన్నానని అంటుంది. డాక్యుమెంట్స్ చూపించదు. తండ్రి ఎవరో తెలియదు. ఎమన్నా అంటే విజయసాయిరెడ్డిని అడుగు అని చెప్పింది. నేను విదేశాల్లో ఉండగా శాంతి నా పరువు మొత్తం తీసేసిందంటూ కన్నీరు పెట్టుకున్నాడు.

#madan-mohan #vijayasai-reddy #shanthi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి