విశాఖలో విషాదం.. నీటి సంపులోకి దూకి ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య
మర్రిపాలెంలోని ప్రకాష్ నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో సంధ్య దంపతులు గత కొంత కాలంగా నివాసం ఉంటున్నారు. ఆమె భర్త అపార్ట్ మెంట్ కి వాచ్ మెన్ గా విధులు నిర్వహిస్తుండగా.. మృతురాలు సంధ్య అపార్ట్ మెంట్ లో ఏవో చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేది. వీరికి గౌతమ్(9), అలేఖ్య(5) అనే కూతురు, కొడుకు ఉన్నారు. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ.. మంగళవారం అర్థరాత్రి అపార్ట్ మెంట్ లోని నీటి సంపులో ఇద్దరు పిల్లలతో పాటు తాను దూకి ఆత్మహత్యకి పాల్పడింది..