గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు సాయిచంద్ సంస్మరణ సభ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఘనంగా నిర్వహించారు. సాయిచంద్ స్మారక సభలో సతీమణి గిడ్డంగుల చైర్మన్ వేద రజిని.. సాయిచంద్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సాయిచంద్ చెప్పిన విషయాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అంతేకాకుండా ఓయూ ప్రొఫెసర్ కాశీరాంతో పాటు వివిధ జానపద కళాకారులు, ప్రొఫెసర్, విద్యార్థులు సాయిచంద్తో ఉన్న బంధాన్ని, స్నేహాన్ని, పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తన జీవితం తెలంగాణ ప్రజల కోసం పాట ద్వారా నిరంతరం కృషి చేశారని సాయిచంద్ భార్య రజిని చెప్పారు.
పూర్తిగా చదవండి..సాయిచంద్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనైన రజిని.. భర్త కోసం పాట రిలీజ్!
గొప్ప గొప్ప వాళ్ల చరిత్రను సాయిచంద్ తనకు చాలాసార్లు చెప్పేవారని గుర్తు చేసుకున్నారు ఆయన భార్య రజిని. తన భర్త ఆలోచన ఏంటో.. ఆయన అడుగులు ఎటువైపు వేశారో తన ప్రయాణం కూడా అటూ వైపే ఉంటుందన్నారు. సాయిచంద్ అందరివాడు అంటూ భావోద్వేగానికి లోనైన రజిని ఆయనపై రాసిన పాటను రిలీజ్ చేశారు.
Translate this News: