Sadhguru Jaggi Vasudev: ఆసుపత్రి నుంచి సద్గురు జగ్గీ వాసుదేవ్‌ డిశ్చార్జ్

ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సద్గురు జగ్గీ వాసుదేవ్ ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. మెదడు సమస్యతో బాదపతున్న ఆయనకు ఈ నెల 17న వైద్యులు బ్రెయిన్ సర్జరీ చేసిన విషయం తెలిసిందే.

New Update
Sadhguru Jaggi Vasudev: ఆసుపత్రి నుంచి సద్గురు జగ్గీ వాసుదేవ్‌ డిశ్చార్జ్

Sadhguru Jaggi Vasudev Discharged: ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సద్గురు జగ్గీ వాసుదేవ్ ఇవాళ డిశ్చార్జ్ (Brain Surgery) అయ్యారు. మెదడు సమస్యతో బాదపతున్న ఆయనకు ఈ నెల 17న వైద్యులు బ్రెయిన్ సర్జరీ చేసిన విషయం తెలిసిందే.

అసలేం జరిగిందంటే..

సద్గురు జగ్గీ వాసుదేవ్ తన మెదడుకు అత్యవసర శస్త్రచికిత్స చేయించుకున్నారు. గత కొన్ని రోజులుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న ఆయన ఈ నెల 17న ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో (Apollo Hospital) ఆపరేషన్ చేయించుకున్నట్లు జర్నలిస్ట్ ఆనంద్ నరసింహన్ సోషల్ మీడియా వేదికగా వివరాలు వెల్లడించారు. అలాగే ఇషా ఫౌండేషన్ సైతం సద్గురు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ చూసి ఆయన భక్తులు, ఫాలోవర్స్ ఆందోళన చెందడంతో పోస్ట్ ను ఇషా ఫౌండేషన్ డిలిట్ చేసింది.

Sadhguru Undergoes Emergency Brain Surgery

ప్రాణాపాయ స్థితికి గురయ్యారు..

ఈ మేరకు ఆనంద్ ట్వీట్ పరిశీలిస్తే.. ‘సద్గురు (Sadhguru) ఇటీవల ప్రాణాపాయ స్థితికి గురయ్యారు. అతను తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు. అది 14వ తేదీ నాటికి చాలా తీవ్రంగా మారింది. దీని వలన మెదడులో భారీ రక్తస్రావం జరిగింది. మార్చి 17న సద్గురు నాడీ సంబంధిత స్థితి, స్పృహ స్థాయి క్రమంగా క్షీణించింది. వరుస వాంతుల కారణంగా తలనొప్పి తీవ్రమైంది. దీంతో డాక్టర్ వినిత్ సూరి సలహా మేరకు సద్గురు అత్యవసరంగా MRI చేయించుకున్నారు. అపోలో ఢిల్లీకి చెందిన వైద్యుల బృందం డాక్టర్ వినిత్ సూరి, డాక్టర్ ప్రణవ్ కుమార్, డాక్టర్ సుధీర్ త్యాగి, డాక్టర్ ఎస్ ఛటర్జీ ఆధ్వర్యంలో మెదడు వాపు, ప్రాణాంతకమైన ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆస్పత్రిలో అడ్మిట్ అయిన కొద్ది గంటల్లోనే అత్యవసర మెదడు శస్త్రచికిత్స చేయించారు. అయన మెదడు, శరీరం ముఖ్యమైన అవయావలన్నీ మెరుగుపడుతున్నాయి. సద్గురు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అంటూ రాసుకొచ్చాడు.

Also Read: తప్పిన భారీ ప్రమాదం.. విరిగిన విమానం రెక్క

Advertisment
తాజా కథనాలు