Loksabha elections: కేంద్రంలో మూడోసారి అధికారం కోసం బీజేపీ ఎత్తుగడ వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ‘INDIA’ కూటమికి చెక్ పెట్టేలా బీజేపీ భారీ స్కెచ్ వేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ముందుస్తుపై ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అక్టోబర్లో లోక్సభ రద్దవుతుందని.. డిసెంబర్ లేదా జనవరిలో ఐదు రాష్ట్రాలతో పాటే లోక్సభకు ఎన్నికలు జరుగుతాయన్న టాక్ వినిపిస్తోంది. రేపు ముంబైలో ఎన్డీఏ కూటమి పార్టీల సమావేశాం కానున్నాయి. భాగస్వామ్య పార్టీలకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్షా దిశానిర్దేశం చేయనున్నారు. ఇక సెప్టెంబర్ 18 – 22 మధ్య పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగనున్నట్టు కేంద్ర పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఇప్పటికే ప్రకటించారు. ముందస్తు ఎన్నికలపై ఇప్పటికే మమతా, నితీష్ కామెంట్స్ చేశారు. బీజేపీ ఇప్పటికే హెలికాప్టర్లు బుక్ చేసిందని దీదీ చురకలంటించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు:
Loksabha elections: అక్టోబర్లో లోక్సభ రద్దు? ముందస్తు ఎన్నికలు ఫిక్స్..?
ఇండియా కూటమికి చెక్ పెట్టేలా బీజేపీ భారీ స్కెచ్ వేస్తున్నట్టు అర్థమవుతోంది. ముందస్తుపై ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. అక్టోబర్లో లోక్సభ రద్దవుతుందని.. జనవరిలో ముందుస్తు ఎన్నికలు జరగుతాయని తెలుస్తోంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజులపాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది.
Translate this News: