ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కురిసిన వర్షాలు అనేక గ్రామాలను నామరూపం లేకుండా చేశాయి. భారీ వరదలతో ఇళ్లు కోల్పోయి వేల మంది నిరాశ్రయులుగా మారారు. ముఖ్యంగా పశ్చిమగోదావరి(West Godavari) జిల్లాలోని ముంపు ప్రాంత గ్రామాలైన లంక గ్రామాలు ఇంకా వరదల్లో నానుతూనే ఉన్నాయి. నడుంలోతు నీళ్లలో అక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయోధ్య లంక(Ayodhya Lanka)లో Rtv బృందం పర్యటించింది. నడుంలోతు నీటిలోకి వెళ్లిన Rtv బృందం.. గ్రామాల్లో ప్రధాన రహదారిపై నిల్చుంటే రిపోర్టర్ నడుం వరకు నీరు చేరింది. నీటిలో నానుతున్న అయోధ్య లంక (Ayodhya Lanka)గ్రామస్తుల ఇళ్లు ఎప్పుడు కూలిపోతాయే తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు.
పూర్తిగా చదవండి..అయోధ్య లంకలో Rtv
ఆంధ్రప్రదేశ్లో వర్షాలు తగ్గినా వరద మాత్రం తగ్గలేదు. గోదావరి నది శాంతించినా. ముంపు ప్రాంతాల్లో ఉన్న లంక గ్రామాలు మాత్రం ఇంకా నీటిలోనే నానుతున్నాయి. ఎన్నికల సమయంలో జగన్ తమ గ్రామంలో బ్రిడ్జి నిర్మిస్తామని హామి ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక ఇటువైపు వచ్చి చూడలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Translate this News: