Mohan Bhagwat: ఎన్నికలు ముగిశాయని, ఇప్పుడు దేశ నిర్మాణంపై దృష్టి సారించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. లోక్సభ, పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై ఆయన మొదటిసారిగా స్పందించారుఎన్నికలంటే పోటీ మాత్రమే ననీ.. యుద్ధం కాదనీ ఆయన చెప్పారు. ఎన్నికలనేవి ఏకాభిప్రాయ ప్రక్రియ అన్నారు. ప్రతి సమస్యకు రెండు కోణాలు ఉంటాయి.. ఏ సమస్యనైనా పార్లమెంట్ లో రెండు కోణాల్లోనూ పరిశీలించాలని సూచించారు. ప్రతి అంశానికి రెండు వైపులా ఆలోచించాలని, ఒక పార్టీ ఒకవైపు ప్రస్తావిస్తే, ప్రతిపక్షం మరో వైపు ప్రస్తావన తేవాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రక్రియ ద్వారానే సరైన నిర్ణయానికి రాగలమని భగవత్ అన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల ప్రాధాన్యతను ఆయన ఎత్తిచూపారు. నాగ్పూర్లో జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో మాట్లాడిన భగవత్ ఈ కోణంలో కొత్త ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు సలహాలు ఇచ్చారు.
పూర్తిగా చదవండి..Mohan Bhagwat: ఇక దేశనిర్మాణంపై దృష్టి పెట్టండి.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై తొలిసారిగా మాట్లాడారు. నాగ్ పూర్ లో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు అయిపోయాయి.. ఇక దేశనిర్మాణంపై దృష్టి పెట్టండి అని సూచించారు. ఎన్నికలు అంటే యుద్ధం కాదు పోటీ అని ఆయన చెప్పారు.
Translate this News: