WPL 2024: మహిళల ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వరుసగా రెండో సారి భారీ విజయం సాధించింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఈరోజు జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఎనిమిది వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ను చిత్తుగా ఓడించింది. గుజరాత్కు ఇది రెండో ఓటమి. టాస్ ఓడిన గుజరాత్ నిర్ణీత ఓవర్లో ఏడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేయగలిగింది. సోఫీ మోలినెక్స్ మూడు వికెట్లు తీసి గుజరాత్ను చిత్తు చేసింది. అనంతరం ఆర్సీబీ 12.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అధిగమించింది. కెప్టెన్ స్మృతి మంథాన 43 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది.
పూర్తిగా చదవండి..WPL 2024: వరుసగా రెండో విజయం..8 వికెట్ల తేడాతో గుజరాత్ ను చిత్తుగా ఓడించిన ఆర్సీబీ..!!
గుజరాత్ జెయింట్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ విజయం సాధించింది. ఆర్సీబీ ఓపెనర్లు మంథాన, సబ్బినేని మేఘన, ఎల్సీ ఫేర్రీ రాణించడంతో గుజరాత్ జెయింట్స్ పై ఆర్సీబీ విజయం సాధించింది. 108 పరుగుల లక్ష్యాన్ని 12.3ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి చేధించింది.
Translate this News: