Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు బీటెక్‌ విద్యార్థులు మృతి!

తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గైట్ కాలేజీకి చెందిన ప్రవీణ్‌, కార్తీక్‌ అనే విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. వెనుక నుండి వచ్చిన బొగ్గు లారీ బలంగా ఢీకొని వారిద్దరిపై ఎక్కి రోడ్ పై కొంత దూరం ఈడ్చుకెళ్లింది. దాంతో విద్యార్థుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.

Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
New Update

East Godavari District : తూర్పుగోదావరి జిల్లా రాజానగరం దివాన్‌ చెరువు జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో గైట్ కళాశాలలో బీటెక్‌ సెకండ్ ఇయర్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు (B.Tech Students) అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన విద్యార్థులను శ్రీకాకుళం చెందిన రోనంకి ప్రవీణ్ కుమార్ (20), పల్నాడు జిల్లాకు చెందిన చింతా కార్తీక్ (19) గా పోలీసులు గుర్తించారు.

విద్యార్థులు బైక్ పై దివాన్ చెరువు వెళుతుండగా వెనుక నుండి వచ్చిన బొగ్గు లారీ బలంగా ఢీకొని వారిద్దరిపై ఎక్కి రోడ్ పై కొంత దూరం ఈడ్చుకెళ్లింది. దాంతో ఆ జాతీయ రహదారి పై విద్యార్థుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. అయితే ఈ ఘటన అనంతరం లారీ డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యాడు. ఇక ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

అలాగే మొబైల్ ఫోన్ ఆధారంగా మృతుల వివరాలు సేకరిస్తున్న పోలీసులు.. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి (Rajahmundry Government Hospital) కి తరలించారు.

Also Read: జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత!

#andhra-pradesh #road-accident #east-godavari-district
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి