Crime News: సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం.. డివైడర్ ను ఢీకొట్టిన ఎర్టిగా కారు..ఒకరు మృతి

సిద్దిపేట జిల్లా శనిగరం పరిధిలోని శంకర్ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ - హైదరాబాద్ ప్రధాన రహదారిపై అదుపుతప్పిన ఎర్టిగా కారు డివైడర్ ను ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి.

Crime News: సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం.. డివైడర్ ను ఢీకొట్టిన ఎర్టిగా కారు..ఒకరు మృతి
New Update

Crime News: రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరుగుతాయో తెలియదు. అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి కారణాలతో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతునే ఉంటాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో తీవ్ర గాయాలతో బయటపడి జీవితాన్ని నరకప్రాయంగా అనుభవిస్తున్నారు.

Also Read: సైఫ్ మీద వచ్చిన ఆరోపణలు నిజమే.. ర్యాగింగ్ నిరోధక కమిటీ

ఒకరు మృతి..ఇద్దరికి గాయాలు

తాజాగా సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. కోహెడ మండలం శనిగరం పరిధిలోని శంకర్ నగర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ - హైదరాబాద్ ప్రధాన రహదారి వైపు వెళ్తున్న ఎర్టిగా కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Also Read: ఆందోళన, మానసిక ఒత్తిడి తగ్గించే ఐదు మార్గాలు.. మీకోసం..!!

బాధితులు జగిత్యాలకు చెందిన వారు

వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం గాయాలు అయిన వారిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలంకు చేరుకున్న పోలీసులు.. బాధితులు జగిత్యాలకు చెందిన వారిగా గుర్తించారు. సంబంధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్ట్ మార్టం నిమిత్తం డెడ్ బాడీని ఆసుపత్రికి తరలించారు.

#siddipet-district #ts-crime-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe