Ap Crime: ఎన్టీఆర్ జిల్లాలో లారీ-కంటైనర్ ఢీ.. తండ్రీకొడుకులు స్పాట్‌లోనే మృతి

ఎన్టీఆర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ మండలం ఐతవరం వద్ద ఆగివున్న గ్యాస్ సిలిండర్లలోడ్‌తో ఉన్న లారీని కంటైనర్ వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకు మాధవరావు, రామరాజు మృతి చెందారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Ap Crime: ఎన్టీఆర్ జిల్లాలో లారీ-కంటైనర్ ఢీ.. తండ్రీకొడుకులు స్పాట్‌లోనే మృతి
New Update

Ap Crime: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐతవరం గ్రామానికి చెందిన ఇద్దరు తండ్రి కొడుకులు మాధవరావు(65), రామరాజు(45)గా మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐతవరం వద్ద ఆగివున్న గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో ఉన్న లారీని వెనుక నుంచి కంటైనర్ వచ్చి ఢీ కొట్టిందని తెలిపారు. లారితో గుద్దిన తర్వాత ఆపకుండా కంటైనర్ వెళ్లిపోయింది. అనంతరం సమాచారం అందుకున్న కంచికచర్ల హైవే మొబైల్‌ పోలీసులు కేసర దగ్గర ఆ కంటైనర్‌ డ్రైవర్‌ను పట్టుకున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ఇంటి పెద్దలు చనిపోవడంతో కన్నీరు మున్నీరుగా కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. జాతీయ రహదారిపై ఒకే స్పాట్‌లో కొన్ని నిమిషాల వ్యవధిలో మూడు ప్రమాదాలు జరగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: నల్లమలలో వీడిన చిరుత భయం.. జూపార్క్‌కు మరో చిరుత

#ap-crime
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి