AP: అనంతపురంలో దారుణం.. మృతదేహంతోనే అంత దూరం ప్రయాణం

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగినది. బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని కారు ఢీకొన్నది. ఎగిరి కారుపై పడిన యువకుడు మృతిదేహాన్ని 15 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు. కొంతమంది వాహనదారులు కారుపై మృతదేహం ఉన్నట్లు గుర్తించారు.

AP: అనంతపురంలో దారుణం.. మృతదేహంతోనే అంత దూరం ప్రయాణం
New Update

 Road Accident: అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగినది. బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని కారు ఢీకొన్నది. ఎగిరి కారుపై పడిన యువకుడు మృతిదేహాన్ని 18 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు. కొంతమంది వాహనదారులు కారుపై మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. అప్రమత్తమైన కారు డ్రైవర్ రోడ్డు పక్కకు కారును ఆపి ఉంచాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తోంది.

ఆదివారం రాత్రి చోటుచేసుకుందన్న ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూడేరు (మం) చోళసముద్రం గ్రామానికి చెందిన జెన్నే ఎర్రిస్వామికి ఆత్మకూరు మండలం సిద్ధరామపురంకి చెందిన మంజులతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎర్రిస్వామి ట్రాక్టర్‌ మెకానిక్‌గా జీవనం సాగిస్తున్నారు. ఆదివారం బైక్‌పై అత్తారింటికి వచ్చి నిన్నరాత్రి అనంతపురానికి బయలుదేరాడు. వై.కొత్తపల్లి వద్దకు చేరుకున్న ఎర్రిస్వామిని ఎదురుగా వచ్చి ఇన్నోవా కారు ఢీకొంది. దీంతో ఎర్రిస్వామి కారు పైభాగంపై పడి మృతి చెందాడని తెలిపారు.

అయితే.. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ కారును ఆపకుండా దూసుకెళ్లాడు. దాదాపు 18 కి.మీ దూరం వెళ్లిపోయాడు. బెళుగుప్ప మండలం హనిమిరెడ్డిపల్లి దగ్గర కొందమంది కారు పైభాగంపై మృతదేహం ఉండటాన్ని గుర్తించారు. కారు డ్రైవర్‌కు ఆ విషయం చెప్పారు. దీంతో కారును రోడ్డు పక్కన ఆపి.. టాప్‌పై పడి ఉన్న మృతదేహాన్ని చూసి అక్కడి నుంచి పారిపోయాడు. గ్రామస్తుల సహాయంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: వేసవిలో పుదీనా జ్యూస్‌ తాగితే ఈ సమస్యలు ఉండవు

#anantapur-district #road-accident
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి