రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. తనను సీఎంగా ప్రకటించిన నేపథ్యంలో ఢిల్లీలో అగ్రనేతలను కలిసి ధన్యవాదాలు తెలిపారు రేవంత్ రెడ్డి. ఇంకా.. మంత్రివర్గ కూర్పుపై చర్చించారు. ఓ దశలో ఢిల్లీ ఎయిర్పోర్టు కు వచ్చి హైదరాబాద్ కు బయలుదేరున్న సమయంలో హైకమాండ్ నుంచి ఫోన్ రావడంతో తిరిగి వెళ్లారు రేవంత్.
ఇది కూడా చదవండి: Hyderabad Traffic Update: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఆ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు!
Revanth Reddy: హైదరాబాద్ చేరుకున్న రేవంత్.. రేపు ప్రమాణస్వీకారం చేయనున్న మంత్రులు వీళ్లే!
సీఎంగా పేరు ప్రకటన తర్వాత నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి కొద్ది సేపటి క్రితం హైదరాబాద్ కు తిరిగివచ్చారు. అధిష్టానంతో చర్చల తర్వాత మంత్రుల జాబితాతో ఆయన వచ్చినట్లు తెలుస్తోంది. రేపు రేవంత్ తో పాటు మొత్తం ఆరుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం.
Translate this News: