కాంగ్రెస్ నేతల అరెస్ట్.. రేవంత్ గరంగరం

కాంగ్రెస్ నేతల అరెస్ట్‌లపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల అరెస్టులు దారుణం అన్నారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో కేసీఆర్ పార్టీ ప్రచారం చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియాగం చేస్తున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ నేతల అరెస్ట్.. రేవంత్ గరంగరం
New Update

Revanth Reddy is angry with BRS party

కాంగ్రెస్ నాయకుల అరెస్టులు దారుణం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల అరెస్ట్‌లపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల అరెస్టులు అప్రజాస్వామికమన్నారు. రేవంత్ మీడియాతో మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాల పేరుతో సీఎం పార్టీ ప్రచారం చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియాగం చేస్తున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇది ఖచ్చితంగా దశాబ్ది దగా నే అంటూ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఒక హామీ అయినా పూర్తిగా అమలు చేసారా అని నిలదీశారు. కేసీఆర్ ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసిన హామీలనే తాము ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై పోరాడే హక్కు ఉందన్నారు. ముందస్తు అరెస్టులు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి ఉద్యమాన్ని ఆపలేరన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

త్సవాలకు వ్యతిరేకంగా నిరసన

కాగా.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ది దగా పేరుతో కార్యక్రమాలు చేపట్టింది. ఈక్రమంలో అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ నేతలను నిరసనలు చేపట్టకుండా అడ్డుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. కార్యక్రమాలకు హాజరవ్వకుండా కాంగ్రెస్ నాయకులను గృహనిర్బంధం చేస్తున్నారు. అటు సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అరెస్ట్‌లు చేసి పోలీస్‌స్టేషన్‌లకు తరలిస్తున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe