Paytm : పేటీఎం కస్టమర్లకు షాక్..ఫిబ్రవరి 29 నుంచి ఈ పని చేయలేరు..!!

పేటీఎం పేమెంట్ బ్యాంకుకు ఆర్బీఐ షాకిచ్చింది. ఫిబ్రవరి 29 తర్వాత కస్టమర్ ఖాతాలు, వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌లకు డిపాజిట్లు లేదా టాప్-అప్‌లను ఆమోదించకుండా Paytm పేమెంట్స్ బ్యాంక్‌ను RBI నిషేధించింది.

New Update
Paytm : పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కు మరో భారీ షాక్...రూ. 5.49కోట్ల జరిమానా.!

Paytm : భారతీయ రిజర్వు బ్యాంకు(RBI) మరో కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ డిజిటల్ బ్యాంక్ Paytm పేమెంట్ బ్యాంక్ ఫిబ్రవరి 29 నుండి ఎటువంటి డిపాజిట్లను స్వీకరించకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేధించింది. పేటీఎం పేమెంట్ బ్యాంక్ (PPBL) ఎటువంటి డిపాజిట్‌లను ఆమోదించడానికి లేదా ఏదైనా ప్రీపెయిడ్ బిల్లు చెల్లింపు, టాప్ అప్ లేదా వాలెట్ లేదా ఫాస్ట్‌ట్యాగ్‌లలో డిపాజిట్ చేయడానికి అనుమతి ఉండదని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.వాలెట్‌తో సహా ఎలాంటి క్రెడిట్ లావాదేవీలు చేయడానికి Paytm పేమెంట్ బ్యాంక్ అనుమతి ఉండదని RBI తెలిపింది.

అయితే, ఖాతాదారులు లేదా Paytm వినియోగదారులు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పేటీఎం కస్టమర్‌లు తమ మిగిలిన బ్యాలెన్స్‌ను ఉపసంహరించుకోవడానికి లేదా ఉపయోగించుకోవడానికి ఎలాంటి పరిమితి ఉండదని సెంట్రల్ బ్యాంక్ (RBI) తెలిపింది. మిగిలిన బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత, వినియోగదారులు దానిని ఉపయోగించలేరు.

RBI ఈ చర్య ఎందుకు తీసుకుంది?
రాయిటర్స్ నివేదిక ప్రకారం, నిబంధనలను పాటించకపోవడం, పర్యవేక్షక ఆందోళనల కారణంగా Paytm పేమెంట్స్ బ్యాంక్ తన సేవలపై కొత్త డిపాజిట్, క్రెడిట్ లావాదేవీలను ఆమోదించకుండా RBI నిషేధించింది. ఆడిట్ నివేదికల్లో లోపాలను గుర్తించిన తర్వాత ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆర్‌బీఐ ఆ ప్రకటనలో తెలిపింది.

మీరు క్యాష్‌బ్యాక్, రీఫండ్ మొత్తాన్ని పొందుతారు:
ఫిబ్రవరి 29, 2024 తర్వాత, Paytm పేమెంట్ బ్యాంక్ ద్వారా కొత్త లావాదేవీ లేదా టాప్ అప్ చేయడం సాధ్యం కాదని RBI తెలిపింది. అయితే, దీని ద్వారా వడ్డీ, క్యాష్‌బ్యాక్ లేదా రీఫండ్ లావాదేవీలు చేయవచ్చు.

కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆర్‌బీఐ ఆదేశాలు జారీ:
దీనికి ముందు, మార్చి 2022లో, కొత్త కస్టమర్‌లను చేర్చుకోవద్దని RBI పేటీఎం పేమెంట్ బ్యాంక్‌ని ఆదేశించిని సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: బ్యాంకు కస్టమర్స్ కు అలర్ట్.. ఫిబ్రవరిలో 11 రోజుల పాటు మూతపడనున్న బ్యాంకులు..!!

Advertisment
తాజా కథనాలు