రిజర్వేషన్ సమస్య పై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీం కోర్టు!

బీహార్‌లో రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచుతూ నీతీశ్ ప్రభుత్వం ఇటీవలె ఉత్తర్వులు జారీ చేసింది.అయితే రిజర్వేషన్ అంశాన్ని రద్దు చేస్తూ పాట్నా హైకోర్టు తీర్పునిచ్చింది.దీంతో బీహార ప్రభుత్వం సుప్రీంకోర్టులో మధ్యంతర స్టే కోసం పిటీషన్ దాఖలు చేయగా దానికి న్యాయస్థానం నిరాకరించింది.

New Update
రిజర్వేషన్ సమస్య పై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీం కోర్టు!

బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ నేతృత్వంలో జనతాదళ్‌-బీజేపీ కూటమి పాలన సాగుతోంది. రాష్ట్రంలో ఇటీవల కుల గణన జరిగింది. దీనిని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్ల స్థాయిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది.

ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, ఎస్సీలకు రిజర్వేషన్లను 50% నుంచి 65%కి పెంచుతూ చట్టం చేశారు. ఈ చట్టం వెనుకబడిన తరగతులకు 43 శాతం, షెడ్యూల్డ్ కులాలకు 20 శాతం, షెడ్యూల్డ్ తెగలకు 2 శాతం పెంచింది. దీనిపై పాట్నా హైకోర్టులో పిటీషన్  దాఖలైంది. రిజర్వేషన్లను 50% నుంచి 65%కి పెంచిన చట్టాన్ని పాట్నా హైకోర్టు కొట్టివేసింది.

దీనిపై సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. బీహార్‌లో రిజర్వేషన్‌ పరిమితిని 50 శాతం నుంచి 65 శాతానికి పెంచుతూ జారీ చేసిన నోటిఫికేషన్‌ రద్దు ప్రక్రియ కొనసాగుతుందని పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇందుకు సంబంధించిన కేసులను సెప్టెంబర్‌లో విచారిస్తామని న్యాయమూర్తులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు