ఊహించని అనుభవం
అయితే హీరోయిన్ రష్మికాకు అభిమానులతో సెల్ఫీలు దిగుతున్న సమయంలో ఊహించని అనుభవం ఎదురైంది. రష్మిక చేతిలో ఉన్న ఓ అభిమాని ఫోన్ను ఆమె బాక్సార్ విసురుగా లాక్కున్న వీడియో వైరల్ అవుతోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అంటే కుర్రకారుకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఎక్కడికి వెళ్లినా.. ఫ్యాన్ ఫాలోయింగ్ బీభత్సంగా ఉంటోంది. చివరికి ముంబైలో కూడా ఆమెకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె అంటే వారికి ఎంత ఇష్టమంటే.. ఏకంగా ఆమె ఫోనే చేతిలో నుంచి లాగేసుకునేంతగా ఉన్నారు.
సెల్ఫీల కోసం ఎగబడిన ఫ్యాన్స్
అయితే ఓ మూవీ షూటింగ్లో రష్మిక ముంబైలో పాల్గొంది. ఆమెను చూసేందుకు అక్కడికి ఫ్యాన్స్ చాలామంది వచ్చారు. కొందరైతే ఏకంగా ఆమె కారవాన్ చుట్టూ గుమిగూడారు. రష్మికాను చూడగానే సెల్ఫీల కోసం ఎగబడ్డారు. రష్మిక కూడా వారికి నో చెప్పకుండా చాలా ఓపిగ్గా వారితో సెల్ఫీలు దిగింది. ఇంతలో ఒక అభిమాని ఆమెతో ఫొటో దింగేందుకు ఫోన్ ముందుకు పెట్టాడు. రష్మిక ఆ ఫోన్ను తన చేత్తో పట్టుకుని తన అభిమానికి హెల్ప్ చేయడానికి ప్రయత్నించింది. అయితే, ఆమె పక్కనే ఉన్న బౌన్సర్ ఆమె చేతిలో ఫోన్ను విసురుగా లాక్కున్నాడు. ఆ తర్వాత ఆ ఫోన్ను ఆ అభిమానికి ఇచ్చేశాడు. అతడి పనికి రష్మిక కాస్త షాకైనా.. మళ్లీ స్మైల్తో కవర్ చేసింది. మిగతా అభిమానులతో కూడా సెల్ఫీలకు దిగింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే, ఈ వీడియో సరిగ్గా చూడనివారు.. అభిమానే ఆమె చేతి నుంచి ఫోన్ లాక్కున్నట్లు ప్రచారం చేస్తున్నారు.
విడిపోతున్నారా అంటూ కామెంట్ల వర్షం
ఇదిలాంటే .. రష్మిక మందన్నా హీరో విజయ్ దేవరకొండతో రిలేషన్లో ఉందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారం సోషల్ మీడియాలో కూడా వీరి పోస్టులు ఇందుకు బలం చేకూర్చాయని చూడోచ్చు. అయితే, తాజాగా రష్మిక పోస్ట్ చేసిన ఓ వీడియోను కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. దీంతో విజయ్, రష్మిక విడిపోయారని అందుకే రష్మిక ఈ వీడియో షేర్ చేసింది అంటున్నారు ఆ వీడియో చూసిన నెటిజన్స్. ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో విడిపోవడం గురించి ఓ ఇన్స్పిరేషనల్ వీడియోను షేర్ చేసింది. దీంతో రష్మికకు ఏమైంది అంటూ ఆరా తీయడం ప్రారంభించారు నెటిజన్స్. రష్మిక, విజయ్ విడిపోతున్నారా అంటూ కామెంట్లు గుప్పిస్తున్నారు.
బిజీ బిజీగా రష్మిక
రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కుతోన్న పుష్ప 2 మూవీలో నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్లో జాయినైంది రష్మిక. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్ కూడా నటించగా, సాయి పల్లవి కూడా నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా, రష్మిక పైప్ లైన్లో యానిమల్ మూవీ కూడా ఉంది. రణబీర్ కపూర్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ఈ మూవీకు సందీప్రెడ్డి వంగా దర్శకుడు. ఈ సినిమా డిసెంబర్లో విడుదల కానుందని చిత్ర టీం వెల్లడించారు.