Ram Lalla Silver Coin : వెండి నాణేలపై బాలరాముడు..త్వరలోనే మార్కెట్లోకి..!

అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడి చిత్రాలతో కూడిన వెండి నాణేలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ముంబై బులియన్ మార్కెట్ ఈ వెండి నాణేలను విడుదల చేయనుంది. త్వరలోనే వ్యాపారు నాణేలను తీసుకువచ్చి ఆఫ్ లైన్ తోపాటు ఆన్ లైన్ లోనూ విక్రయించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

New Update
Ram Lalla Silver Coin : వెండి నాణేలపై బాలరాముడు..త్వరలోనే మార్కెట్లోకి..!

Ram Lalla Silver Coin : అయోధ్యలోని బాలరాముడి భక్తులకు శుభవార్త. అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడి చిత్రాలతో కూడిన వెండి నాణేలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ముంబై బులియన్ మార్కెట్ ఈ నాణేలను విడుదల చేయనుంది. త్వరలోనే వ్యాపారులు నాణేలను తీసుకువచ్చి ఆఫ్ లైన్ తోపాటు ఆన్ లైన్లో విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ముంబై బులియన్ మార్కెట్ తో సంబంధాలున్న వ్యాపారులు నాణేల డిజైన్, బరువు, లభ్యతపై ఏకాభిప్రాయానికి వచ్చారు. త్వరలోనే వీటికి మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అయితే,దీని గురించి బులియన్‌ మార్కెట్‌ వ్యాపారులు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. బాలరాముడి చిత్రంతో కూడిన వెండి నాణేలు ఇప్పటికే వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లలో విక్రయిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఏడాది జనవరి 22న అయోధ్య రామాలయంలో బాల రామయ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. ఆ తర్వాత బాలరాముడికి సంబంధించిన మూడు సావనీర్‌ నాణేలను సైతం ప్రభుత్వం రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి నెలలో ప్రభుత్వ యాజమాన్యంలోని సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SPMCIL) 19వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కాయిన్స్ ను విడుదల చేసింది.

ఈ నాణేలపై బాలరాముడు, రామజన్మభూమి ఆలయం, అయోధ్య ఇతివృత్తాలను చక్కగా తీర్చిదిద్దారు. ఈ నాణేలను 999 గ్రాముల స్వచ్ఛమైన వెండితో తయారు చేసినట్లు తయారుదారులు తెలిపారు. శ్రీరాముడి చిత్రంతో కూడిన నాణెం బ్రిటిష్ కాలంలో కూడా రిలీజ్ అయ్యింది. 161 ఏళ్లనాటి ఈ నాణెంపై శ్రీరాముడి కుటుంబం చిత్రాన్ని ఆ నాణేలపై ముద్రించారు. కాగా ఈ నాణెం ఇప్పటికీ మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌కు చెందిన రమేశ్‌ కొండల్కర్ వద్ద ఉన్నట్లు సమాచారం. 1862లో ఈస్ట్‌ఇండియా కంపెనీ హయాంలో ఈ నాణెం వెలువడినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. తప్పిన పెను ప్రమాదం.!

Advertisment
Advertisment
తాజా కథనాలు