Hyderabad: నీకు దమ్ముంటే ఆ పని చేయ్.. రేవంత్‌కు ఈట‌ల స‌వాల్!

సీఎం రేవంత్ కు దమ్ముంటే మల్కాజ్ గిరిలో స్థానికుడినే ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలంటూ బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. బ‌య‌టివాడిని నిలబెడితే సంగతి తేలుస్తానంటూ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. తనను త‌ట్టుకోవాలంటే రూ.400 కోట్లు ఖ‌ర్చు పెట్టేటోడు కావాలంటూ సంచలన కామెంట్స్ చేశారు.

New Update
Hyderabad: నీకు దమ్ముంటే ఆ పని చేయ్.. రేవంత్‌కు ఈట‌ల స‌వాల్!

Etala Rajender: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీలన్నీ పోటాపోటీగా అభ్యర్థులను ఎంపిక చేస్తూ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని మ‌ల్కాజ్‌గిరిలో ఎంపిగా స్థానికుడిని నిల‌బెట్టాలంటూ రేవంత్‌కు ఈట‌ల స‌వాల్ చేశారు. నిజంగా దమ్ముంటే మల్కాజిగిరి ప్రాంతం వాడినే అభ్యర్థిగా నిలబెట్టాలని, బ‌య‌టివాడిని నిలబెడితే సంగతి తేలుస్తానంటూ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Malla Reddy: మల్లారెడ్డి కోడలుకు విద్యార్థుల కౌంటర్.. అంతా అవినీతే అంటూ క్యాంపస్ లో లొల్లి!

నీకు ద‌మ్ముంటే అలా చేయ్..
ఈ మేరకు మ‌ల్కాజ్‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన ఓ స‌మావేశంలో పాల్గొన్న ఈట‌ల మాట్లాడుతూ.. 'మ‌ల్కాజ్‌గిరితో నాకు ఏలాంటి సంబంధం లేదని రేవంత్ చెబుతున్నాడు. మ‌రి నీకేం సంబంధం ఉంది చెప్పు. ఈ సందర్భంగా ఒక ఛాలెంజ్ వేస్తున్నా.. నీకు ద‌మ్ముంటే ఈ ప్రాంతం వాడినే మ‌ల్కాజ్‌గిరిలో పోటీ చేయించు. ఈ ప్రాంతంతో సంబంధం ఏమిట‌ని అంటున్నావు క‌దా.. నీకు నిజంగా ద‌మ్ముంటే ఈ ప్రాంతం నుంచి ఒక ఎంపీ అభ్యర్థిని నిల‌బెట్టు. బ‌య‌టి వ్యక్తిని నిల‌బెడితే నీ సంగ‌తి చెప్తాం' అంటూ హెచ్చరించారు. అలాగే రేవంత్‌కు ద‌మ్ము లేదని, మల్కాజ్ గిరీ అభ్యర్థి కోసం వెతుకులాడుతున్నాడంటూ ఆరోపించారు. అంతేకాదు రూ.200 కోట్లు ఖ‌ర్చు పెట్టే అభ్యర్థి కావాలని రేవంత్ చూస్తున్నాడన్న ఈటల.. తనను త‌ట్టుకోవాలంటే రూ.400 కోట్లు ఖ‌ర్చు పెట్టేటోడు కావాలంటూ సంచలన కామెంట్స్ చేశారు.

Advertisment
తాజా కథనాలు