Raj Tarun: నీ గేమ్ ఎండ్ అయింది.. లాయర్ రాజేష్‌ బ్లాక్‌మెయిల్‌పై లావణ్య ఓపెన్!

నటుడు రాజ్ తరుణ్‌ లవ్ కేసులో లాయర్ రాజేష్ తనను భయాందోళనకు గురిచేశారని బాధితురాలు లావణ్య చెప్పారు. ఆయన బ్లాక్‌మెయిల్ చేస్తున్నారో, మంచి చేయాలనుకున్నారో అర్థం కాలేదన్నారు. రాజేష్‌ మాటలతో డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానంటూ సంచలన విషయాలు బయటపెట్టారు.

New Update
Raj Tarun: నీ గేమ్ ఎండ్ అయింది.. లాయర్ రాజేష్‌ బ్లాక్‌మెయిల్‌పై లావణ్య ఓపెన్!

Lavanya: నటుడు రాజ్ తరుణ్‌ లవ్ కేసు విషయంలో బాధితురాలు లావణ్య మరిన్ని సంచలనాలు బయటపెట్టింది. గురువారం సూసైడ్ చేసుకుంటానంటూ ఆందోళన వ్యక్తం చేసిన ఆమె.. ఈ ఇష్యూలో లాయర్ రాజేష్ పాత్ర కూడా ఉందంటూ పలు విషయాలు వెల్లడించింది. ఈ మేరకు మూవీలో యాక్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్‌ ఉందా వారం రోజుల క్రితం రాజేష్‌ తనకు టెక్స్ట్ మెసేజ్ చేశారని చెప్పింది. అంతేకాదు నేను అడ్వకేట్‌ను. నీకు ఏమైనా ప్రాబ్లమ్స్‌ ఉంటే చెప్పమన్నారు. కానీ నా కేసు గురించి రాజేష్‌తో నేను చెప్పలేదు. అప్పటికి కల్యాణ్‌ సుంకరను సంప్రదించలేదు. కానీ తర్వాత కల్యాణ్‌ను కలిసి ఆయన ద్వారానే కేసులో ముందుకెళ్తున్నట్లు తెలిపింది లావణ్య.

ఆయన మాటలతో డిప్రెసన్‌లోకి వెళ్లాను..
అయితే లవ్ కేసు విషయంలో తన మెసేజ్‌ అందరికీ వెళ్లినట్లే రాజేష్ కు వెళ్లిందని చెప్పింది. మెసేజ్ పంపిన తర్వాత కూడా రాజేష్‌తో కాల్‌ మాట్లాడలేదని, కానీ తర్వాత కేసు నిలబడదని తనలో అన్నారని తెలిపింది. తప్పుడు సెక్షన్స్ పెట్టించారని భయాందోళనకు గురిచేశారు. రాజేష్‌ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారో, మంచి చేయాలనుకున్నారో అర్థం కాలేదు. రాజేష్‌ మాటలతో నేనింకా డిప్రెషన్‌లోకి వెళ్లాను. ఆ బాధలోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అని తెలిపింది. ఏది ఏమైనా రాజ్‌ తరుణ్ తన ప్రపంచమని, రాజ్‌ తరుణ్‌ వస్తాడన్న నమ్మకంతోనే ఫైట్ చేస్తున్నట్లు చెప్పింది.

రూ. 5 కోట్లు ఇస్తాం, సారీ చెప్పాలంటూ..
అలాగే రాజ్‌ తరుణ్ పేరెంట్స్‌ లాయర్‌ రాజేష్‌ను సంప్రదించారని తెలిసింది. వాళ్ల పేరెంట్స్ తరపున ఉన్న లాయర్‌ నన్ను ఎందుకు సంప్రదించారో అర్థం కావడం లేదు.రాజ్‌ తరుణ్‌ మేనేజర్‌ అంటూ ఒక నంబర్‌ నుంచి నన్ను అప్రోచ్ అయ్యారు. లాయర్‌ అని మరొకరు అప్రోచ్ అయ్యారు. రూ. 5 కోట్లు ఇస్తాం, సారీ చెప్పి కేసు వెనక్కి తీసుకోవాలన్నారు. అంతటితో ఆగకుండా నీ గేమ్ ఎండ్ అయింది, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో అర్థం కావట్లేదని బెదిరించారు. హై ప్రోఫైల్‌ అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. రాజ్‌ తరుణ్‌ నాకు కావాలనేది నా ఉద్దేశం. నేను ఎప్పుడు చనిపోయిన అందుకు కారణం మాల్వి మల్హోత్రానే అంటూ లావణ్య సంచలన ఆరోపణలు చేసింది.

Advertisment
తాజా కథనాలు