WATCH LIVE: రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభ.. వాచ్ లైవ్

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ న్యాయ్ యాత్ర ముగింపు సభ ముంబైలో జరుగుతోంది. ఈ సభకు వివిధ రాష్ట్రాలలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, నేతలు హాజరు అయ్యారు.

New Update
WATCH LIVE: రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభ.. వాచ్ లైవ్

Rahul Gandhi: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ న్యాయ్ యాత్ర ముగింపు సభ ముంబైలో జరుగుతోంది. ఈ సభకు వివిధ రాష్ట్రాలలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, నేతలు హాజరు అయ్యారు.

అందుకే రాజకీయాల్లోకి వచ్చాము..

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు ఈరోజు ముగింపు పడనుంది. ఈరోజు ముంబైలో ఈ ముగింపు సభను ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు. ఈ సభకు ఇండియా కూటమిలో ఉన్న పార్టీల నేతలు, పలు రాష్ట్రల ముఖ్యమంత్రులు హాజరు అయ్యారు. ఈ సభకు హాజరు అయిన తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చామని అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలు దేశాన్ని ఏకం చేస్తున్నాయని అన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో ఉన్న రాష్ట్రాలను విభజించాలని చూస్తుందని ఆరోపించారు. భారత్ జోడో యాత్ర తో రాహుల్ దేశంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లి ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారని పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు