AP: వైసీపీలో భగ్గుమన్న అంతర్గత విభేదాలు.. ఏకంగా సర్పంచ్ తల నరుకుతానంటూ బెదిరింపులు!

ఎన్టీఆర్ జిల్లా వైసీపీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. త్రినాథ్ వర్గం నేతలు తమను తల నరికి చంపుతామని బెదిరిస్తున్నారని పెనుగంచిప్రోలు మండలంలోని అనిగండ్లపాడు సర్పంచ్ బోజండ్ల జ్యోతి-బ్రహ్మం దంపతులు ఆరోపిస్తుండడం చర్చనీయాంశమైంది.

AP: వైసీపీలో భగ్గుమన్న అంతర్గత విభేదాలు.. ఏకంగా సర్పంచ్ తల నరుకుతానంటూ బెదిరింపులు!
New Update

మరో సారి అధికారంలోకి రావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న అధికార వైసీపీకి అంతర్గత విభేదాలు తలనొప్పిగా మారాయి. ఇప్పటికే పలు చోట్ల సీట్ల కోసం పలువురు నాయకులు బాహాబాహికి దిగి మాటల దాడి చేసుకుంటుండగా.. తాజాగా ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం ఆనిగండ్లపాడు గ్రామంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఆనిగండ్లపాడు గ్రామ సర్పంచ్ బోజండ్ల జ్యోతి భర్త బ్రహ్మానికి సంబంధించిన లారీని గుర్తు తెలియని దుండగులు తగలబెట్టారు. అంతేకాదు అతని వరి కోత మిషన్ డీజిల్ ట్యాంకులో ఇసుకపోసిన నానా హంగామా సృష్టించారు.

త్రినాథ్ వర్గం బెదిరింపులు..

ఈ క్రమంలోనే తమకు జరిగిన అన్యాయంపై ఆందోళన వ్యక్తం చేసిన సర్పంచ్ జ్యోతి-బ్రహ్మం దంపతులు సొంతపార్టీ నేలతపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గత వారం రోజుల నుంచి వైసీపీకి చెందిన త్రినాథ్ వర్గం తమను చంపుతానని బెదిరిస్తున్నట్లు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి : Hyderabad: మల్లారెడ్డి మమ్ములను ముంచిండు.. ప్రజావాణిలో 700 మంది బాధితుల ఫిర్యాదు

కులం పేరుతో దూషణలు..

ఇక ప్రభుత్వ మద్యం దుకాణంలో రూ. 33 లక్షల రూపాయల అక్రమాలకు పాల్పడ్డట్టు బోశెట్టి త్రినాథ్ పై పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. కాగా ఈ అక్రమ మద్యం కేసులో పోశెట్టి త్రినాథ్ కు తాము వ్యతిరేకంగా వ్యవహరించామనే నేపథ్యంలో వైరం పెంచుకుని తమను నష్టపరిచేందుకు లారీకి నిప్పు పెట్టారని సర్పంచ్ భర్త బ్రహ్మం ఆరోపిస్తున్నారు. తాను ఎస్టీ కులానికి చెందిన మహిళ కావడంతో త్రినాథ్ కులం పేరుతో దూషించి అవమానపరిచాడని సర్పంచ్ జ్యోతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాదు తన భర్త బ్రహ్మానికి ఫోన్ చేసి జనవరి పదో తారీకు నాటికి తల మొండెం వేరు చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డట్టు సర్పంచ్ జ్యోతి ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణ చేసి చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నారు. పార్టీ వీరి వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

#ycp-leaders #avanigandla-padu #quarrels
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి