మరో సారి అధికారంలోకి రావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న అధికార వైసీపీకి అంతర్గత విభేదాలు తలనొప్పిగా మారాయి. ఇప్పటికే పలు చోట్ల సీట్ల కోసం పలువురు నాయకులు బాహాబాహికి దిగి మాటల దాడి చేసుకుంటుండగా.. తాజాగా ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం ఆనిగండ్లపాడు గ్రామంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఆనిగండ్లపాడు గ్రామ సర్పంచ్ బోజండ్ల జ్యోతి భర్త బ్రహ్మానికి సంబంధించిన లారీని గుర్తు తెలియని దుండగులు తగలబెట్టారు. అంతేకాదు అతని వరి కోత మిషన్ డీజిల్ ట్యాంకులో ఇసుకపోసిన నానా హంగామా సృష్టించారు.
పూర్తిగా చదవండి..AP: వైసీపీలో భగ్గుమన్న అంతర్గత విభేదాలు.. ఏకంగా సర్పంచ్ తల నరుకుతానంటూ బెదిరింపులు!
ఎన్టీఆర్ జిల్లా వైసీపీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. త్రినాథ్ వర్గం నేతలు తమను తల నరికి చంపుతామని బెదిరిస్తున్నారని పెనుగంచిప్రోలు మండలంలోని అనిగండ్లపాడు సర్పంచ్ బోజండ్ల జ్యోతి-బ్రహ్మం దంపతులు ఆరోపిస్తుండడం చర్చనీయాంశమైంది.
Translate this News: