AP: రాష్ట్రంలో బీజేపీ ఫోకస్ ఇదే.. పురంధేశ్వరి సెన్సేషనల్ కామెంట్స్..!

పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వరకూ మొక్కలు నాటాలని జాతీయ స్థాయిలో పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ మేరకు విజయవాడలో కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటినట్లు తెలిపారు.

New Update
AP: రాష్ట్రంలో బీజేపీ ఫోకస్ ఇదే.. పురంధేశ్వరి సెన్సేషనల్ కామెంట్స్..!

BJP Purandeswari: రాజమండ్రి ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడలో మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించామన్నారు. సమాజంలో ఉండే అన్ని అంశాలపై కూడా బీజేపీ ఏకాగ్రత పెట్టిందని వెల్లడించారు. దేశంలో వర్షం అతివృష్టి అనావృష్టిగా ఉందని.. ఢిల్లీలో ఇటీవల 53 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు చేరాయని తెలిపారు.

Also Read: హీరో రాజ్‌తరుణ్‌పై లవర్‌ లావణ్య సంచలన ఆరోపణలు.. పెళ్లి చేసుకుంటానని, వదిలేసి వెళ్లిపోయాడంటూ!

శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్థంతి సందర్భంగా జూన్ 23 నుండి జులై 6 వరకూ మొక్కలు నాటాలని జాతీయ స్థాయిలో పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రకృతిని తల్లిగా భావిస్తామని అందుకే అమ్మ కోసం మొక్క అనే పేరుతో జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు నేడు కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటినట్లు వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు