Kichen tips : భారీగా పెరిగిన వాటి ధరలు.. ఎంతంటే?

మరికొన్ని రోజుల్లో నవరాత్రులు షురూ కానున్నాయి. కానీ అంతకుముందే సామాన్యులకు షాకిచ్చింది ద్రవ్యోల్బణం. పిండి, నూనె కాకుండా, వంటగదికి సంబంధించిన ప్రతి వస్తువు ధరలు పెరిగాయి. జీలకర్ర కిలో రూ. 800కి చేరగా, ఎర్ర మిర్చి, పసుపు, గరం మసాలా ధరలు కూడా పెరిగాయి. చక్కెర కూడా ఖరీదుగా మారి కిలో రూ.44కు చేరింది. ద్రవ్యోల్బణం ప్రభావంతో పప్పుల ధరలు కూడా పెరిగాయి. ద్రవ్యోల్బణం సామాన్యులను మళ్లీ ఇబ్బంది పెడుతోంది. పప్పులు, మసాలా దినుసులపై కేవలం నెల రోజుల్లోనే ధరలు గణనీయంగా పెరిగాయి. పెరుగుతున్న పప్పులు, మసాలాల ధరలు సామాన్యుడి బడ్జెట్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సుగంధ ద్రవ్యాల ధరల పెరుగుదల పౌరుల జేబులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పప్పులు కొనాలంటేనే జంకుతున్నారు.

New Update
Kichen tips : భారీగా పెరిగిన వాటి ధరలు.. ఎంతంటే?

మరికొన్ని రోజుల్లో నవరాత్రులు షురూ కానున్నాయి. కానీ అంతకుముందే సామాన్యులకు షాకిచ్చింది ద్రవ్యోల్బణం. పిండి, నూనె కాకుండా, వంటగదికి సంబంధించిన ప్రతి వస్తువు ధరలు పెరిగాయి. జీలకర్ర కిలో రూ. 800కి చేరగా, ఎర్ర మిర్చి, పసుపు, గరం మసాలా ధరలు కూడా పెరిగాయి. చక్కెర కూడా ఖరీదుగా మారి కిలో రూ.44కు చేరింది. ద్రవ్యోల్బణం ప్రభావంతో పప్పుల ధరలు కూడా పెరిగాయి. ద్రవ్యోల్బణం సామాన్యులను మళ్లీ ఇబ్బంది పెడుతోంది. పప్పులు, మసాలా దినుసులపై కేవలం నెల రోజుల్లోనే ధరలు గణనీయంగా పెరిగాయి. పెరుగుతున్న పప్పులు, మసాలాల ధరలు సామాన్యుడి బడ్జెట్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సుగంధ ద్రవ్యాల ధరల పెరుగుదల పౌరుల జేబులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పప్పులు కొనాలంటేనే జంకుతున్నారు.

ఇది కూడా చదవండి:  టీఆర్టీ కూడా వాయిదా ? లేటెస్ట్ అప్డేట్ ఇదే!

అకాల వర్షాల కారణంగా చాలా వరకు పంటలు నాశనం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే పప్పుధాన్యాల ధరలు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. . సరఫరా తగ్గడంతో ధరలు పెరిగాయి. గత నెల రోజులుగా కిలో పప్పు ధర రూ.20 పెరిగిందని అశోక్ కుమార్ జైన్ బంటి అనే వ్యాపారి చెబుతున్నాడు. అటు సుగంధ ద్రవ్యాల ధరలు గణనీయంగా పెరిగాయి. ఎండుమిర్చి, చిన్న ఏలకులు మరింత ఖరీదయ్యాయి. పిండి, ఆవాల నూనె ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. చక్కెరపై కూడా పెరిగింది.

ఇవీ ప్రస్తుత ధరలు: ప్రాంతాన్ని బట్టి మార్పులు ఉండే అవకాశం ఉంది.

ఆహార పదార్థాలు - మొదటి ధర - ఇప్పుడు
ఎర్ర మిర్చి - 260-300
పసుపు- 120-160
జీలకర్ర- 800- 1200
నల్ల మిరియాలు - 600-800
చక్కెర- 38-44
పప్పు - 70-90
శనగలు - 100-120
మస్టర్డ్ ఆయిల్-120-110
చిన్న ఏలకులు-2000-3000
ఇవన్నీ కిలో ధరలు. అటు కూరగాయ ధరలు కూడా భారీగానే పెరిగాయి. మొత్తానికి ఈ పండగల సీజన్ లో సామాన్యుడిని జేబు ఖాళీ అవ్వడం ఖాయం.

ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ పార్టీ మీద..విజయశాంతి సంచలన వ్యాఖ్యలు…ఏమన్నారో తెలుసా?

Advertisment
తాజా కథనాలు