Prudhvi Raj: అతడు ఉన్నంతవరకు సినీ ఇండస్ట్రీ బాగుపడదు.. పృథ్వీరాజ్ హాట్ కామెంట్స్..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి అని నటుడు పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ను ఓడిస్తే గాని సినిమా ఇండస్ట్రీ బాగుపడదని కామెంట్స్ చేశారు.

New Update
Prudhvi Raj: అతడు ఉన్నంతవరకు సినీ ఇండస్ట్రీ బాగుపడదు.. పృథ్వీరాజ్ హాట్ కామెంట్స్..!

Prudhvi Raj: అనకాపల్లిలో జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ గెలిపించాలని కోరుతూ ప్రచారం చేపట్టారు నటుడు పృథ్వీరాజ్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీని నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి అని  సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: పిఠాపురంలో కోట్ల విలువైన మద్యం సీజ్‌..!

సినీ ఇండస్ట్రీ బాగుకోసం చిరంజీవి తోపాటు ఇతర అగ్రనటులను జగన్మోహన్ రెడ్డి ఇంటికి రప్పించాడని.. అయితే గేటు దగ్గర నుంచి ఇంటి వరకు వారిని నడిపించి అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తే గాని సినిమా ఇండస్ట్రీ బాగుపడదని నటుడు పృథ్వీరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు