/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/MODI-ID-CARD-jpg.webp)
BJP National Conference: భారతీయ జనతా పార్టీ రెండు రోజుల జాతీయ మహాసభలు శనివారం నుంచి ఢిల్లీలోని ప్రగతి మైదాన్లోని భారత్ మండపంలో ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్షా, రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రధాని మోదీ ఈ సదస్సును ప్రారంభించారు.బీజేపీ జాతీయ మహాసభల సందర్భంగా హాజరైన వారు డిజిటల్ ఐడీ కార్డులతో కనిపించారు. బిజెపి జాతీయ సమావేశం మధ్య ప్రధాని మోదీకి సంబంధించిన ఐడీ కార్డు వెలుగులోకి వచ్చింది. ఈ ఐడీ కార్డు 2009లో దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ జాతీయ మహాసభలు జరిగినప్పుడు, గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ కార్యక్రమానికి హాజరైన నాటిది.
వైరల్ అవుతున్న 15 ఏళ్ల ఐడీ కార్డు:
ప్రధాని మోదీకి సంబంధించిన ఈ 2009 గుర్తింపు కార్డు @modiarchive ఎక్స్ లో షేర్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం 2009 జూన్ 20-21 తేదీలలో న్యూఢిల్లీలో జరిగినట్లు గుర్తింపు కార్డులో చూడవచ్చు. ఈ సమావేశంలో నరేంద్ర మోదీ ఐడీ కార్డుపై గుజరాత్ ముఖ్యమంత్రి అని రాశారు. విశేషమేమిటంటే.. కాలక్రమేణా బీజేపీ జారీ చేసే ఐడీ కార్డు రూపురేఖలు మారిపోయాయి. ఇప్పుడు ఐడీ కార్డ్ డిజిటల్ రూపంలో కనిపిస్తుంది. ప్రధాని మోదీ 15 ఏళ్ల నాటి ఐడీ కార్డు ఇప్పుడు వైరల్ అవుతోంది.
Narendra Modi's identity card, from the BJP National Executive Meeting in 2009. pic.twitter.com/FEiKvmp3kO
— Modi Archive (@modiarchive) February 17, 2024
లోక్సభ ఎన్నికల సన్నాహాలు:
బీజేపీ రెండు రోజుల జాతీయ మహాసభలు ఫిబ్రవరి 17-18 తేదీల్లో భారత మండపంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సదస్సు ద్వారా 2024 లోక్సభ ఎన్నికల సన్నాహాలను కూడా బీజేపీ సమీక్షించనుంది. ప్రధానమంత్రి, కేంద్రమంత్రులతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, జాతీయ, రాష్ట్ర పార్టీల అధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ జాతీయ సదస్సుకు హాజరవుతున్నారు.
ఇది కూడా చదవండి: బాణాసంచా తయారీ కార్మాగారంలో పేలుడు.. 10 మంది మృతి..