PM Modi: వచ్చే నెలలో ఏపీకి ప్రధాని మోదీ!

వచ్చే నెల మొదటి వారంలో ప్రధాని మోదీ ఏపీలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కృష్ణపట్నం సిటీ పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. కాగా మోదీ పర్యటనపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

New Update
PM Modi: వచ్చే నెలలో ఏపీకి ప్రధాని మోదీ!

PM Modi: ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు రానున్నారు. వచ్చే నెల మొదటివారంలో ఆయన ఏపీకి రానున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కృష్ణపట్నం సిటీ పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాష్ట్రంలో తొలి గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీగా క్రిస్ సిటీ ఉండనుంది. సెమీకండక్టర్ తయారీ పరిశ్రమలకు క్రిస్ సిటీలో ప్రాధాన్యం నెలకొంది.

కూటమి ప్రభుత్వానికి 100 రోజుల పూర్తైన సందర్భంగా నిర్వహించేలా మరో ప్రతిపాదన రూపొందిస్తున్నారు అధికారులు. ప్రధాని టూర్‌పై అధికారుల సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రధాని రాక వీలుకాకుంటే వర్చువల్ విధానంలో కార్యక్రమం నిర్వహించాలని చంద్రబాబు సర్కార్ యోచిస్తోంది. మూడు దశల్లో 11, 096 ఎకరాల్లో క్రిస్ సిటీ నిర్మిస్తోంది బాబు సర్కార్.

Advertisment
తాజా కథనాలు