అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. భారతదేశ వ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారతీయ రైల్వే చరిత్రలో ఇది కొత్త అధ్యాయానికి నాంది అన్నారు. ఈ సందర్భంగా విపక్షాల వైఖరిపై మోదీ విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాల తీరు ప్రతికూల రాజకీయాలేనన్నారు. సానుకూల రాజకీయాలే మా లక్ష్యం అని ప్రధాని మోదీ అన్నారు.
పూర్తిగా చదవండి..వాళ్లు చేయరు..చేయనివ్వరు…విపక్షాలపై ప్రధాని మోదీ ఫైర్..!!
భారతీయ రైల్వే చరిత్రలో నేటి నుంచి కొత్త అధ్యాయం ప్రారంభమైదన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధాని మోదీ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీల వైఖరిని ఎండగట్టారు.
Translate this News: