ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళాకు సన్నాహాలు

మహాకుంభమేళాకు సమయం ఆసన్నమైంది. ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో 2025లో కుంభమేళాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికోసం భారతీయ రైల్వే ముందస్తు సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకుగాను ప్రత్యేకంగా 800 రైళ్లను నడిపేందుకు ప్రణాళిక రూపొందించింది. దేశ నలుమూలల నుంచి భక్తులు ప్రయాగ్‌రాజ్‌ వెళ్లి తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.

New Update
ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళాకు సన్నాహాలు

publive-image

మహా కుంభమేళాకు సంబంధించి రైల్వేమంత్రి అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్టేషన్లలో ఏర్పాట్లను నుంచి రైళ్ల ప్రస్తుత స్థితిగతులపై సమీక్షించారు.

భారీ అంచనా
మహాకుంభానికి ఉత్తర మధ్య రైల్వే నోడల్‌గా మారనున్నది. ప్రయాగ్‌రాజ్‌లోని నార్తర్న్ రైల్వే, నార్త్ ఈస్టర్న్ రైల్వే సైతం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించనున్నది. ప్రయాణీకులకు ఈశాన్య రైల్వేలోని ప్రయాగ్‌రాజ్ జంక్షన్, నైని, రామ్ బాగ్, సుబేదర్‌గంజ్, చివ్కీ, ఉత్తర రైల్వేలోని ప్రయాగ్‌రాజ్ సంగం, ప్రయాగ్, ఫఫమౌ రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేయనున్నారు. 2025లో జరిగే కుంభమేళాకు దాదాపు 15కోట్ల మందికిపైగా భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. యాత్రికులకు మెరుగైన రవాణా సౌకర్యం కోసం ఎన్‌సీఆర్‌, ఎన్‌సీఆర్‌, ఎన్‌ఆర్‌ 9 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నాయి.

ప్రతీ క్షణం తనిఖీలు

రూ.837కోట్ల బడ్జెట్‌తో ఆర్‌వోబీ, ఆర్‌యూబీలు సైతం నిర్మించనున్నారు. ఇందుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. కుంభమేళా సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నది.స్టేషన్ ప్రాంగణం లోపల, బయట పర్యావరణాన్ని పరిశీలించనున్నారు. రైల్వే అధికారులు, ఉద్యోగులు ఢిల్లీ కంట్రోల్‌ రూమ్‌ నుంచి 24 గంటల పాటు రైళ్లను తనిఖీ చేయనున్నారు.

రైళ్లు, ప్లాట్‌ఫారమ్‌లు, బయటి స్టేషన్‌లలో రద్దీని అంచనా వేయడానికి ప్రత్యేక సాంకేతిక బృందాన్ని నియమించనున్నారు. ఈ బృందం ఇప్పటికప్పుడు కంట్రోల్‌ రూమ్‌ నుంచి వెంటనే నివేదికలను పంపుతుంది.
2019 కుంభమేళా సమయంలో విధుల్లో ఉన్న ఉద్యోగుల అనుభవాన్ని సైతం వినియోగించుకోనున్నారు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు బస చేసేందుకు వివిధ రంగుల షెడ్లను ఏర్పాటు చేయనున్నారు.

నిందితుల కోసం సాంకేతిక పరిజ్ఞానం

దేశంలోని ఎంపిక చేసిన ప్రధాన స్టేషన్లలో ప్రస్తుతం ఫేస్ రికగ్నిషన్ సీసీటీవీ కెమెరాలను అమర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉత్తర మధ్య రైల్వేలోని ప్రయాగ్‌రాజ్ డివిజన్‌లోని ప్రయాగ్‌రాజ్ జంక్షన్ స్టేషన్ నుంచి ప్రారంభంకానున్నది.అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను గుర్తించేందుకు అవకాశం ఉంది. ‘ఫేస్ రికగ్నిషన్’ టెక్నాలజీతో ఈ కెమెరాలను అమర్చిన తర్వాత, నేరస్తులను సులభంగా పర్యవేక్షించడంతోపాటు పట్టుకోవచ్చని పేర్కొంటున్నారు.

హైటెక్ టెక్నాలజీ

ప్రయాగ్‌రాజ్ జంక్షన్, ఇతర రైల్వే స్టేషన్లలో అమర్చిన ఈ హైటెక్ టెక్నాలజీ కెమెరాలతో పాటు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌ను కూడా కంప్యూటర్‌లలో అమర్చనున్నారు. ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ సహాయంతో ముఖాన్ని దాచడంతో పాటు మారువేషంలో రైల్వే స్టేషన్‌లోకి వెళ్లేందుకు నిందితులు, నేరస్తులు వెళ్లే సమయంలో సులభంగా పట్టుకోవచ్చని పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Viral Video: ఆటో డ్రైవర్‌ను చెప్పుతో కొట్టి.. కాళ్లు పట్టుకున్న మహిళ - వీడియో వైరల్

బెంగళూరులో ఓ మహిళ రెచ్చిపోయింది. ఆటో డ్రైవర్‌ను బండ బూతులు తిడుతూ చెప్పుతో దాడి చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అనంతరం స్టేషన్ బెయిల్‌పై బయటకొచ్చిన ఆ మహిళ తన భర్తతో కలిసి ఆటో డ్రైవర్ కాళ్లు మొక్కి క్షమాపణలు వేడుకుంది.

New Update
bengaluru woman hits auto driver with slipper Video Viral

bengaluru woman hits auto driver with slipper Video Viral

బెంగళూరులో ఓ మహిళ రెచ్చిపోయింది. ఆటో డ్రైవర్‌ను బండ బూతులు తిడుతూ చెలరేగిపోయింది. అంతటితో ఆగకుండా అతడిపై చెప్పుతో దాడి చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెకు తగిన బుద్ది చెప్పారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: మమతా పాలనలో దారుణాలు.. బెంగాల్‌లో అధికారం మాదే: అమిత్ షా

చెప్పుతో కొట్టి కాళ్లు పట్టుకున్న మహిళ

పంఖూరి మిశ్రా అనే మహిళ తన భర్తతో కలిసి స్కూటీపై ప్రయాణిస్తుంది. అదే సమయంలో ఆటో డ్రైవర్ లోకేష్ వారికి డాష్ ఇచ్చాడు. అక్కడే ఇరువురికి మధ్య గొడవ మొదలైంది. ఆటో చక్రం తన పాదంపై నుంచి వెళ్లిందని ఆరోపిస్తూ ఆ మహిళ ఆటో డ్రైవర్‌తో గొడవకు దిగింది. అక్కడితో ఆగకుండా బండ బూతులు తిట్టింది. 

Also Read: జ్యోతి మల్హోత్రా కేరళ టూర్‌కు సీఎం అల్లుడే స్పాన్సర్.. బీజేపీ సంచలన ఆరోపణలు

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అయితే ఆమె హిందీలో మాట్లాడుతుండటంతో ఆటో డ్రైవర్ లోకేష్ వీడియో తీశాడు. దీంతో మరింత చిర్రెత్తిపోయిన ఆ మహిళ తన కాలుకున్న చెప్పుతీసి లోకేష్‌పై దాడి చేసింది. ‘‘వీడియో తీస్తావా? తీసుకో’’ అంటూ అతడిని పలుమార్లు కొట్టింది. కానీ డ్రైవర్ లోకేష్ మాత్రం ఆమెను ఏం అనలేదు. అనంతరం ఆ మహిళ ఫోన్‌లో మాట్లాడింది. తనతో ఆటో డ్రైవర్ దురుసుగా ప్రవర్తిస్తున్నాడని తెలిపింది. 

Also Read: బంగ్లాదేశ్‌ కొత్త కరెన్సీ నోట్లపై హిందూ, బౌద్ధ ఆలయాలు

అయితే అదే సమయంలో ఆమె భర్త కూడా అక్కడే ఉన్నాడు. ఆటో పక్కన స్కూటీపై కూర్చుని వీడియో రికార్డు చేశాడు. ఈ గొడవ అనంతరం లోకేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తప్పేమి లేదని.. కావాలంటే సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే తప్పు ఎవరిదో అర్థం అవుతుందని తెలిపాడు. ఆమె భాష అర్థం కాక వీడియో తీశానని తెలిపాడు. 

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ మహిలను అరెస్టు చేశారు. ఆ తర్వాత స్టేషన్ బెయిల్ పై విడుదలైన ఆ మహిళ తన భర్తతో కలిసి ఆటో డ్రైవర్ ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పింది. భర్తతో కలిసి ఆటో డ్రైవర్ కాళ్లు మొక్కుతూ క్షమించమని వేడుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.  

 

bangalore | crime | bangalore-police | Latest crime news

Advertisment
Advertisment