Hyderabad: రచ్చకెక్కిన వివాహేతర సంబంధం.. తండ్రిని చితకబాదిన కొడుకులు, తల్లి!

పెళ్లై ముగ్గురు పిల్లలున్నా ప్రవీణ్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం హాట్ టాపిక్ గా మారింది. ముషీరాబాద్‌ ఎస్ఆర్ టీ కాలనీకి చెందిన ప్రవీణ్‌.. అంబర్‌పేట్‌ డీడీ కాలనీలో ప్రియురాలితో ఉండగా భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కొడుకులతో కలిసి దేహశుద్ధి చేసింది. వీడియో వైరల్ అవుతోంది.

New Update
Hyderabad: రచ్చకెక్కిన వివాహేతర సంబంధం.. తండ్రిని చితకబాదిన కొడుకులు, తల్లి!

Amberpet Illegal Affair Incident: హైదరాబాద్‌ అంబర్‌పేట్‌ డీడీ కాలనీలో ఓ వివాహేతర సంబంధం ఇష్యూ రచ్చకెక్కింది. భర్త ప్రియురాలితో ఉండగా పోలీసులతో కలిసి భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని తమ కొడుకులతో కలిసి దేహ శుద్ధి చేసింది. అలాగే పెళ్లై పిల్లలున్నా తన భర్తతో ఎలా ఉంటావంటూ భర్త ప్రియురాలితో వాగ్వాదానికి దిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా వివరాలు ఇలా ఉన్నాయి.

భార్యపై విచక్షణ రహితంగా దాడి..
ఈ మేరకు ముషీరాబాద్‌ SRTకాలనీకి చెందిన ప్రవీణ్‌ కొంతకాలంగా తను పనిచేస్తున్న కంపెనీలోని మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకొని అంబర్‌పేట్‌లోని డీడీకాలనీలో సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం గమనించిన భార్య ఎన్నోసార్లు నిలదీసింది. అయినా ప్రవీణ్ తన ప్రవర్తన మార్చుకోలేదు. దీంతో అన్యాయం చేశాడని భార్య ఆవేదన చెండగా.. ప్రవీణ్ తన భార్యపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. పలుమార్లు దారుణంగా కొట్టాడు. ఈ క్రమంలోనే కొన్నాళ్లు ఓపిక పట్టిన బాధితురాలు.. వారిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు పోలీసులు, తన బంధువులతో కలిసి రెండ్ హ్యాండెడ్ పట్టుకుంది. ప్రియురాలికి కూడా పెళ్లై ఇద్దరు పిల్లలున్నట్లు సమాచారం. కాగా తమకు న్యాయం చేయాలని బాధితురాలి తీవ్ర ఆవేదన చెందుతూ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసుకుని ప్రవీణ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Also Read: వాహనదారులకు బిగ్ షాక్.. 3 రూపాయలు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!

Advertisment
తాజా కథనాలు